ఇక నుంచి తిరుమలకు వచ్చే వారికోసం గదుల కేటాయించే విధంగా ఈ రకమైన చర్యలు తీసుకుంది టీటీడీ. సాధారణ భక్తులకు 6 చోట్ల రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఉంటాయి. జీఎన్ సీ, బాలాజీ బస్టాండ్ తో పాటుగా కౌస్తుభం, సీఆర్ఓ, రామ్ భగీచ ఎంబీసీ వద్ద భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాగా ఈ రిజిస్ట్రేషన్ కేంద్రాలను శనివారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్టార్ట్ చేశారు. అనంతంర ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఈజీగా అద్దె గదులు భక్తులకు అందుతాయన్నారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ ఆరు కౌంటర్ల ద్వారా ఎక్కడైన గదులు బుక్ చేసుకోవచ్చని ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న గదులు కేటాయించే సీఆర్ఓ ఆఫీసు దగ్గర భక్తుల రద్దీ బాగా ఉందని, దీంతో అక్కడ వాహనాల నిలపడం చాలా ఇబ్బందిగా మారిందన్నారు. ఈ కారణాల వల్ల వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి ఈ విధమైన రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు వివరించారు.
భక్తుల కోసమే ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ధర్మారెడ్డి చెప్పారు. తాము పెట్టిన ఆన్ లైన్ పద్ధతిలో గదులు బుక్ చేసుకున్న వారెవరైనా కొత్తగా ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్లలో కచ్చితంగా తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వారికి ఈ అవకాశం కల్పించారు ధర్మారెడ్డి. గది కేటాయింపుకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తులకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు మెసేజ్ ద్వారా వస్తుందని చెప్పారు.