మైసూరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న రోహిణిని తాజాగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించింది యడియూరప్ప సర్కార్. అయితే ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈమె బదిలీకి వ్యతిరేకత తెలుపుతూ రోహిణి సింధూరికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు ప్రజలు. కన్సర్న్డ్ సిటీజన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ "బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి" అనే నినాదంతో ఆన్ లైన్ ద్వారా ప్రజల యొక్క సంతకాలను సేకరిస్తుండగా ఈమెకు మద్దతు పలుకుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రజలు బ్రింగ్ బ్యాక్ రోహిణి అంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆన్లైన్లో సంతకాలు చేస్తున్నారు.
మైసూరు డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తోన్న రోహిణిని తాజాగా బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించింది యడియూరప్ప సర్కార్. అయితే ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈమె బదిలీకి వ్యతిరేకత తెలుపుతూ రోహిణి సింధూరికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నారు ప్రజలు. కన్సర్న్డ్ సిటీజన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ "బ్రింగ్ బ్యాక్ రోహిణి సింధూరి" అనే నినాదంతో ఆన్ లైన్ ద్వారా ప్రజల యొక్క సంతకాలను సేకరిస్తుండగా ఈమెకు మద్దతు పలుకుతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రజలు బ్రింగ్ బ్యాక్ రోహిణి అంటూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆన్లైన్లో సంతకాలు చేస్తున్నారు.