ఉత్తర మహారాష్ట్రలోని శివసేన కార్యకర్తలను ఉద్దేశించి సంజయ్ రౌత్ మాట్లాడారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు శివసేనను ఆశ్రయించిందని, కానీ బీజేపీ నాయకులు ఆ సమయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని, శివసేన నాయకులను బీజేపీ బానిసలుగా చూశారని, దాంతో పాటుగా శివసేనను తమ అధికారంతో నామరూపాలు లేకుండా మహారాష్ట్రలో కనుమరు చేయాలని బీజేపీ ప్రయత్నించిందని సంజయ్ అన్నారు. శివసేన అందించిన అధికారాన్ని అనుభవిస్తూ తమనే నాశనం చేయాలని చూసిందని సంజయ్ అన్నారు.
అయితే 2019లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంపై ఈ రెండు పార్టీల మధ్య విభేధాలు రావడంతో శివసేన, బీజేపీ విడిపోయాయి. ఆ తరువాత శివసేన, ఎన్సీఏతో కలిసి ఎమ్వీఏ (మహా వికాస్ అఘాది) కూటమిని సిద్దం చేసి దాని ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని సంజయ్ తెలిపారు. అంతేకాకుండా 2019 ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఏర్పాటు కోసం అజిత్ పవార్ అనేక పన్నాగాలు పన్నారని, ఇందులో భాగంగా బీజేపీతో కూడా చేతులు కలిపేందుకు సిద్దమయ్యారని, అటువంటి అజిత్ పవార్ ఇప్పుడు శివ సేన నాయకుడు ఉద్దవ్ థాక్రేతో కలిసి పనిచేస్తున్నారంటూ సంజయ్ పేర్కొన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని దానిని శివసేన నిజం చేసిందని అన్నారు.