బ్రెజిల్ దేశ అధ్యక్షుడు అయిన జైర్ బొల్సనారో కరోనా నియమాలు పాటించలేదు. సావొో పాలోలో బైక్ ర్యాలీ నిర్వహించనుండగా ఆ ర్యాలీకి అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. అయితే ఆయన ఆ సమయంలో మాస్కు పెట్టుకోకుండా ర్యాలీకి వచ్చాడు. దీంతో ఆ ర్యాలీకి వచ్చిన వారంతా మాస్కులు ధరించకుండా ఊరుకున్నారు. ఆ సమయంలో అధ్యక్షుడు కూడా వారిని ఏమీ వాదించలేదు. పైగా వారిని ఎంకరేజ్ చేశాడు. రాబోవు ఎన్నికల్లో ఈయన పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ ర్యాలీకి హాజరయ్యారు. అయితే దీనిని గమనించిన ఆ రాష్ట్ర గవర్నర్ జో డోరియా అధ్యక్షుడికి జరిమానా విధించాడు. వాస్తవంగా ఆ ప్రాంతంలో మాస్కు ధరించకపోతే కఠిన నిబంధన పాటించకపోతే జరిమానా కచ్చితంగా విధిస్తారు. దీంతో ఆ గవర్నర్ దేశాధ్యక్షుడిపైనే జరిమానా విధించారు. డోరియా అధికారులు అధ్యక్షుడికి 100 డాలర్ల జరిమానాను విధించారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.
బ్రెజిల్ దేశ అధ్యక్షుడు అయిన జైర్ బొల్సనారో కరోనా నియమాలు పాటించలేదు. సావొో పాలోలో బైక్ ర్యాలీ నిర్వహించనుండగా ఆ ర్యాలీకి అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. అయితే ఆయన ఆ సమయంలో మాస్కు పెట్టుకోకుండా ర్యాలీకి వచ్చాడు. దీంతో ఆ ర్యాలీకి వచ్చిన వారంతా మాస్కులు ధరించకుండా ఊరుకున్నారు. ఆ సమయంలో అధ్యక్షుడు కూడా వారిని ఏమీ వాదించలేదు. పైగా వారిని ఎంకరేజ్ చేశాడు. రాబోవు ఎన్నికల్లో ఈయన పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ ర్యాలీకి హాజరయ్యారు. అయితే దీనిని గమనించిన ఆ రాష్ట్ర గవర్నర్ జో డోరియా అధ్యక్షుడికి జరిమానా విధించాడు. వాస్తవంగా ఆ ప్రాంతంలో మాస్కు ధరించకపోతే కఠిన నిబంధన పాటించకపోతే జరిమానా కచ్చితంగా విధిస్తారు. దీంతో ఆ గవర్నర్ దేశాధ్యక్షుడిపైనే జరిమానా విధించారు. డోరియా అధికారులు అధ్యక్షుడికి 100 డాలర్ల జరిమానాను విధించారు. ప్రస్తుతం ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది.