ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా  ఇంకెన్ని దారుణమైన శిక్షలు విధించినా అటు కామాంధుల ఆగడాలు మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. దీంతో ఆడపిల్ల జీవితం కాస్తా రోజురోజుకు ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. నెలలు నిండని పసికందుల నుంచి పండు ముదుసలి వరకు కూడా ఎవరినీ వదలడం లేదు కామాంధులు. ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు.



 ఇక రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఈ సభ్య సమాజంలో బ్రతుకుతున్నది మనుషులా మనిషి రూపంలో ఉన్న క్రూర మృగాల అని అనిపిస్తూ ఉంది.  నాగరికత వైపు పరుగులు పెడుతున్న సభ్యసమాజాన్ని అనాగరిక ఘటనలతో ఎప్పటికప్పుడు ప్రశ్నార్థకంగానే మార్చేస్తున్నారు కామాంధులు.  ఇలా ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్ల కామాంధుల బారినపడి బలవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.



 మాటలు రాని మూగ యువతి విషయంలో కూడా కాస్తయిన కనికరం చూపించలేకపోయారు. మూగ యువతి విషయంలో మానవ మృగాలు గా మారిన ముగ్గురు మైనర్లు దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన  ఒక్కసారికి ఉలిక్కిపడేలా చేసింది. వరంగల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి చనిపోవడం ఇక తండ్రి పని మీద బయటకి ప్రాంతానికి వెళ్లడంతో ఇక 23 ఏళ్ల యువతి అమ్మమ్మా దగ్గరే ఉంటుంది. ఇక ఆ మూగ యువతి పై కన్నేసిన ముగ్గురు బాలురు ఇంట్లోకి వచ్చి యువతి అమ్మమ్మకు మాయమాటలు చెప్పి చివరికి అభం శుభం తెలియని ఆ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక సరిగ్గా కళ్ళు కనబడని అమ్మమ్మను మాటల్లోకి దింపి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా తనకు జరిగిన అన్యాయం గురించి యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: