హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.మన్సాస్ ట్రస్ట్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షనీయమని ఆయన అన్నారు. న్యాయంపై అన్యాయం గెలవడం అసాధ్యమని మరోసారి తేలిపోయిందన్నారు.ధార్మిక సంస్థలను సైతం తుగ్లక్ సీఎం నిర్వీర్యం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాల ఆస్తుల్ని, వేలాది ఎకరాల భూముల్ని కొల్లగొట్టాలన్న జగన్ మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు న్యాయం, చట్టం అడ్డుకట్ట వేసిందన్నారు.అప్రజాస్వామికంగా ఎన్ని చీకటి జీవోలు ఇచ్చినా చట్టం ముందు న్యాయానిదే గెలుపు అని నిరూపించిందన్నారు.పూసపాటి వంశీకులు ఆదరించిన లక్షలాది మంది విద్యార్ధులు, వేలాది మంది ఉద్యోగులకు హైకోర్టు తీర్పు ఊపిరినిచ్చిందని చంద్రబాబు తెలిపారు.గజపతిరాజుల వంశ ప్రతిష్టకు జగన్మోహన్రెడ్డి
మసిపూయాలనుకున్నారని..అధికారం ఉందని అడ్డగోలుగా జీవోలు ఇస్తే న్యాయం,చట్టం చూస్తూ ఉండవన్నారు.మాన్సాన్ ట్రస్ట్ పై అశోక్ గజపతి రాజు పోరాటం చేశారన్నారు. సింహాద్రి అప్పన్న అండగా ఉన్నంత వరకు న్యాయం,ధర్మం, చట్టం ఏకమై జగన్మోహన్రెడ్డి తాటతీస్తాయని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు.దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కోర్టులతో ఇన్నిసార్లు తలంటించుకోలేదని..కోర్టులిచ్చే తీర్పులతోనైనా జగన్ మోహన్రెడ్డి మూర్ఖత్వం వీడాలన్నారు.