ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో యాక్టీవ్ గా ఉన్న టీడీపీ, రాష్ట్ర విభజన అనంతరం టీడీపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసే నాయకుడే కరువయ్యాడని చెప్పాలి. ఇప్పటి వరకు ఏదో పార్టీ ఉందంటే ఉందన్నట్టు లాక్కుంటూ వచ్చారు. అయితే గత వారం రోజులుగా టీడీపీ తెలంగాణాలో రోజులు చెల్లిపోయాయి అన్న రీతిలో వార్తలు వినిపిస్తున్నాయి. టి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ పార్టీని వీడనున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో జోరుగా వినిపిస్తోంది. ఈయన అధికార తెరాస పార్టీలోకి వెళ్లనున్నారని దాదాపు ఖాయమైపోయింది. ఈ టాపిక్ ఇప్పుడు చంద్రబాబు గుండెల్లో సెగలు రేపుతోంది. ఇటీవల రమణ ఈ విషయంపై ఒక స్పష్టత ఇచ్చారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఒక పది రోజుల గ్యాప్ లో తెరాస కండువా కప్పుకోనున్నారు.

ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు నాయుడు లాంటి గొప్ప మహానాయకుడు ఉండి కూడా ఈ విధంగా జరగడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పార్టీని పెట్టడం ఎవ్వరైనా పెడతారు, దానిని సమర్థవంతంగా నడిపించడంలోనే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలి అని విమర్శలు చేస్తున్నారు.  ఏపీ రాజకీయాల్లో చురుగా ఉన్న నారా లోకేష్ సైతం తెలంగాణలో టీడీపీని గాలి కొదిలేశారు. ఎల్ రమణ అంత సమర్ధవంతమైన నాయకుడు కనపప్పటికీ కూడా, ఆ సమయంలో ప్రత్యామ్నాయంగా ఎవ్వరూ లేకపోవడంతో బీసీ నేత అయిన రమణ వైపే మొగ్గు చూపారు.  

ఏపీలో ప్రస్తుతం టీడీపీకి గడ్డు కాలం నడుస్తుండగా, తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఎదురవనుంది. ఈ విషయం గురించి చంద్రబాబు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడో ? అలాగే తదుపరి రమణ స్థానంలో ఎవరినైనా నియమిస్తారా లేదా అంది తెలియాల్సి ఉంది. ఎటువంటి అధ్యక్షుడు రానున్నాడు, నూతన అధ్యక్షుడయినా తెలంగాణాలో టీడీపీని ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీకి పూర్వవైభవం తెస్తాడా అన్నది వేచి చూడాలి. పూర్తిగా కూలిపోతున్న టీడీపీకి ఎవరు ప్రాణం పోస్తారో చూడాలి.




మరింత సమాచారం తెలుసుకోండి: