ఇక దీనిపై అశోక్ కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దీనిపై కోర్టు తీర్పు ఇస్తూ, సంచయిత నియామకం చెల్లదని, వెంటనే ప్రభుత్వం ఇచ్చిన జీవోలని రద్దు చేసి, మళ్ళీ అశోక్ గజపతి రాజునే ఛైర్మన్గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ తీర్పు వైసీపీ ప్రభుత్వానికి చెంపదెబ్బ లాంటిది అని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఇక వాస్తవ పరిస్తితులని చూస్తే అశోక్ గజపతి రాజుకు న్యాయం జరిగిందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. సంచయిత బ్యాగ్రౌండ్ ఎలా ఉన్నా సరే కుటుంబంలో పెద్ద వ్యక్తి అశోక్ ఉండగా, సంచయితకు బాధ్యతలు అప్పగించడం ముమ్మాటికి తప్పే అని అంటున్నారు. అసలు అశోక్ని తప్పించే సమయంలో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు వైసీపీ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారని టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరుగుతుంది.