ఇలా కరోనా సృష్టించిన నష్టం గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే. చైనా నుంచి భారత్కు పాకిన ఈ మహమ్మారి.. ఊహించనంత నష్టం కలిగించింది . అయితే కరోనా వైరస్ కారణంగా కొన్ని కుటుంబాలు ఉపాధి దొరక్క రోడ్డు మీద పడితే.. కొన్ని కుటుంబాలో ఇంటి పెద్ద చనిపోయి అభం శుభం తెలియని చిన్నారులు అనాధలుగా పారిపోయారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన చోటుచేసుకుంది.. ఆ ఏళ్ల చిన్నారి ఇంకా లోకాన్ని కూడా సరిగ్గా చూడలేదు. లోకం తీరు కూడా అర్థం చేసుకోలేదు. కానీ అప్పుడే ఆ చిన్నారికి ఇంటి బాధ్యతలు చూసుకునే పరిస్థితి వచ్చింది. కాదు కాదు ఆ పరిస్థితి కరోనా తీసుకొచ్చింది.
తల్లిదండ్రులు కరోనా వైరస్ బారినపడి మృతి చెందడంతో.. ఆడుకోవాల్సిన సమయంలో అన్నీ తానే అయింది ఆ 7 ఏళ్ల చిన్నది. నెలల వయసున్న తమ్ముడునీ భుజాన వేసుకుంది. విశ్వమంత బాధను గుండెల్లో దాచుకుని కన్నతల్లిలా తమ్ముడిని లాలిస్తుంది. అందరి మనసులను కలచివేస్తోన్న ఈ ఘటన ఒడిషా లో చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాకు చెందిన స్మిత అనే మహిళ ప్రసవం జరిగిన వారం రోజుల్లోనే వైరస్ బారినపడి మృతి చెందింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కరోనా తో భర్త కూడా చనిపోయాడు. వారికి ఏళ్ల చిన్నారి, నెలల పసికందు ఉండగా.. వాళ్ళు అనాధలుగా మారిపోయాడు. ప్రస్తుతం వీరిద్దరూ బాబాయి ఇంట్లో ఉంటున్నారు.