ఆ రంగం.. ఎగుమతుల రంగం. అవును మే నెలలో దేశ ఎగుమతులు గణనీయంగా పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే 69.35 శాతం మేర ఎగుమతులు పెరిగాయి. తద్వారా ఎగుమతుల విలువ 32.27 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, ముత్యాలు ఆభరణాల వంటి రంగాల్లో గణనీయమైన వృద్ధి కారణంగా ఈ మేరకు ఎగుమతులు పెరిగాయట.
గత ఏడాది మే నెలలో లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో 19 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు జరిగాయి. 2019 మే నెలలో 29.85 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు నమోదైనట్లు కేంద్రం చెబుతోంది. అలాగే దిగుమతులు కూడా గత నెలలో 73.64 శాతం మేర పెరిగాయట. దిగుమతుల విలువ 38.55 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాది మే నెలలో 22.2 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు జరిగాయి. గత మేనెలలో వాణిజ్య లోటు 6.28 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ మే నెలలో...ఆయిల్, బంగారం దిగుమతులు బాగా పెరిగాయి.
ఏదేమైనా దేశీయంగా లాక్డౌన్ల కారణంగా మార్కెట్లు మూతబడుతున్నాయి. కొన్ని చోట్ల లాక్డౌన్లు లేకపోయినా నైట్ కర్ఫ్యూలు, కరోనా ఆంక్షలతో పని వేళలు బాగా కుదించుకుపోయాయి. ఈ కారణంగా అత్యవసరాల మార్కెటింగ్ మాత్రమే ఎక్కువగా జరుగుతోంది. అందుకే ఈ మేరకు దేశానికి ఆదాయం తగ్గిపోయింది. అయితే.. ఎగుమతులకు లాక్డౌన్ అడ్డుకాకపోవడం వల్ల.. ఎగుమతులు బాగానే జరిగాయి.