ఈ సందర్భంగా ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పాలన గురించి.. అందుతున్న పథకాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు . టిఆర్ఎస్ పార్టీలో ఓపికతో ఉన్న కార్యకర్తలకు ఎప్పటికైనా మంచి అవకాశం లభిస్తుంది అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక వ్యవసాయ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది అంటూ తెలిపారు మంత్రి హరీష్ రావు. ఎన్నో ఏళ్ల పాటు తాగునీరు సాగునీరు లేక తెలంగాణ ప్రజలు అల్లాడిపోయారు అంటూ తెలిపారు. కేవలం టిఆర్ఎస్ వచ్చిన తర్వాతే ఇక తెలంగాణ ప్రజల కష్టాలు తీరాయి అంటూ తెలిపారు.
తొలకరి చినుకు పడకముందే రైతుబంధు రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అన్నారు హరీష్ రావు. అయితే మిగతా పథకాలన్నింటినీ ఆపుతాం కానీ.. అటు రైతులకు అందిస్తున్న సంక్షేమ పథకాలను మాత్రం ఎప్పటికీ ఆపము అంటూ తెలిపారు. భూమికే బరువయ్యేంత పంట తెలంగాణాలో పండించాం అంటూ మంత్రి హరీష్ తెలిపారు. దీని కోసం టిఆర్ఎస్ ప్రభుత్వ కృషి వెలకట్టలేనిది అంటూ చెప్పుకొచ్చారు ఇతర రాష్ట్రాల నుంచి సైతం తెలంగాణకు వచ్చి వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని.. ఆ స్థాయికి తెలంగాణ చేరుకుంది అంటూ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.