కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తం కుదిపేస్తోంది. దాదాపుగా ఏ దేశం కూడా ఈ మహమ్మారి వైరస్ ప్రభావం నుంచి తప్పించుకోలేక పోయింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతూ మరణ మృదంగం మోగిస్తోంది కరోనా వైరస్.  అయితే కరోనా వైరస్ తో ప్రపంచ ప్రజానీకం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.  ఇలాంటి సమయంలో ఇక మనుషుల ప్రాణాలు తీసేందుకు మరిన్ని రకాల ముప్పులు దూసుకు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం వంద దేశాల్లో కుక్కలకు వస్తున్న రేబిస్ వ్యాధి ప్రమాదం అంతకంతకూ పెరుగుతోంది.




 ఇక ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాప్తి చెందుతూ రేబిస్ వ్యాధి కేసులు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయ్  ఇలాంటి నేపథ్యంలో అగ్రరాజ్యమైన అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రేబిస్ వ్యాధి ప్రభావం ఉన్న దేశాల నుంచి కుక్కల దిగుమతి పై నిషేధం విధించింది. దాదాపు యేడాది పాటు నిషేధం కొనసాగుతుందని అమెరికా వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర దేశాల  నుంచి అమెరికాకు తీసుకొచ్చే కుక్కల విషయంలో ఈ నిషేధం వర్తిస్తుంది అని స్పష్టం చేసింది. ఇక అమెరికాలో కుక్కలను తీసుకురావాలంటే ఇక ఆ కుక్కకి రేబిస్ ఇంజక్షన్ జరిగింది అని పత్రాలు చూపించాల్సి ఉంటుంది.


 ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ తప్పుడు ధ్రువపత్రాలు చూపిస్తున్నారని అందుకే  ఏడాది పాటు బయట దేశం నుంచి వచ్చే కుక్కల పై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. జూలై 14 నుంచి ఇక ఈ నిషేధం అమలు లోకి వస్తుంది అమెరికా ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.   ప్రతి ఏటా పది లక్షల కుక్కల వరకు అమెరికాకు దిగుమతి అవుతున్నాయట.  ప్రస్తుతం అమెరికా నిషేధం కారణంగా దాదాపు 7.5 శాతం కుక్కలపై ప్రభావం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అక్కడి వెటర్నిటీ వైద్యులు సైతం చెబుతున్నారు. ఆరోగ్యకరమైన కుక్కలని దేశంలోకి అనుమతించడం వల్ల ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: