* ఏ చిన్నారులకు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన అవసరం వస్తుందో అటువంటి చిన్నారుల చికిత్స సమయంలో వారి తల్లితండ్రులను అనుమతించవచ్చు అని పేర్కొంది.
* చిన్నారులకు వ్యాక్సిన్ ఇవ్వచ్చు అని ప్రభుత్వం నుండి అనుమతి వస్తే ముందుగా ఇతర వ్యాధులతో బాధపడుతున్నటువంటి చిన్నారులకు వ్యాక్సిన్ ను అందించాలి. ఎందుకంటే ఇటువంటి పిల్లలు వేగంగా వైరస్ భారిన పడే అవకాశం ఉంది.
* రానున్న రోజుల్లో కరోనా ప్రభావం పిల్లలపై ఎక్కువైతే అందుకు ప్రైవేటు ప్రభుత్వ రంగాలు ఇరువురు కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకోసం ప్రణాళికను రచించాలి.
*పిల్లల కరోనా చికిత్సలో భాగంగా పెద్దవారికి అందించిన కరోనా ఔషధాలను ఎట్టిపరిస్థితుల్లో వాడరాదు. వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఏ మందులను వాడటం మంచిదో అన్న అంశంపై వైద్యులు అవగాహన పెంచుకోవాలి.
* లాక్ డౌన్ ఎత్తివేసిన అనంతరం స్కూల్స్, కాలేజీలు తిరిగి తెరుచుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు చోటుచేసుకున్నా ఎదుర్కొనేందుకు వైద్య రంగాలు సిద్దంగా ఉండాలి.
* కరోనా మూడవ దశలో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది అన్న అంచనాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అన్ని హాస్పిటల్స్ లో అదనంగా బెడ్స్ ను ఏర్పాటు చేసుకోవాలి. అంతేకాకుండా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
* హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఆశావర్కర్ల సేవలు అవసరం ఎక్కువగా ఉంటుంది. కావున ఈ దిశగా ఆలోచించి తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
*పిల్లల్లో కరోనా సోకిన లక్షణాలు పెద్దగా కనపడవు అలాంటప్పుడు ముఖ్యంగా తల్లి తండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అవసరం అనిపిస్తే వెంటనే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళాలి