ఇక ఆయన కూడా తనకు సొంత నియోజకవర్గంలో ముప్పు ఉందని వెంటనే రక్షణ కావాలని కోరగా ఆయనకు సైతం వై సెక్యురిటీ భద్రతను కల్పించింది. ఇక తమ పార్టీ కాకపోయినా సపోర్ట్ చేసే వారికే అంత ప్రాధాన్యత ఇస్తున్న మెడీ సర్కార్ తమ విరోధి పార్టీ నుండి వచ్చి కాషాయం కప్పుకుంటే సెక్యురిటీ ఇవ్వకుండా ఉంటుందా. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ఎన్నికలకు మందు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి తమ పార్టీలోకి చేరిన ముకుల్ రాయ్ కి ఏకంగా జెట్ క్యాటగిరీ భద్రత కల్పించింది. దాంతో ముకుల్ రాయ్ కోసం 33 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి సెక్యురిటీని కల్పించారు. టీఎంసీ నుండి వస్తున్న బెదిరింపులను ఎదుర్కునేందుకే ముకుల్ రాయ్ కి జెట్ క్యాటగిరీ భద్రతను కల్పిస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది.
అయితే ఎన్నికల తరవాత తృణమూల్ భారీ మెజారిటీతో గెలవడంతో ముకుల్ రాయ్ సొంత గూటికి చేరడమే మేలు అని భావించారు. ఇటీవల పార్టీ అధినేత మమతా బెనర్జీ సమక్షంలో మళ్లీ సొంత పార్టీలో చేరిపోయారు. అంతే కాకుండా దీదీనే తన సుప్రీం నాయకురాలు అని స్పష్టం చేశారు. అంతే కాకుండా తాను తృణమూల్ లోనే సంతోషంగా ఉన్నానని మళ్లీ బీజేపీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దాంతో మోడీ సర్కార్ చిన్న పిల్లల్లా ప్రవర్తించింది. మా పార్టీలో ఉండనప్పుడు మా సెక్యురిటీని మాకు ఇచ్చెయ్.. అంటూ ముకుల్ కు కల్పించిన జెడ్ సెక్యురిటీని తొలగిస్తూ ఉత్తర్వులు జారి చేసింది.