మన దేశం ఓ ద్వీప కల్పం.. అంటే మూడువైపులా నీరు.. ఓవైపు భూమి ఉండే ప్రాంతం. అయితే మూడు వైపులా ఉన్న సముద్రంలో కొన్ని దీవులు కూడా ఉన్నాయి. మన భూభాగానికి దగ్గరగా ఉండే దీవులు మన దేశం ఆధీనంలోనే ఉంటాయి. ఇలాంటి దీవుల్లో అండమాన్ నికోబార్ దీవులు పెద్దవి కాగా.. లక్ష ద్వీవుల పేరుతో ఉన్న దీవుల్లో కొన్ని అతి చిన్నవి. ఇప్పటి వరకూ ఇవే మన దేశ భూభాగంలో ఉన్నాయి. అయితే.. ఇన్నాళ్ల తర్వాత కేరళ తీరంలో ఓ దీవి వంటి ప్రాంతాన్ని కొత్తగా కనిపెట్టడం విశేషం.


కేరళలోని కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం కనిపించటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ కొత్తదీవి వంటి నిర్మాణాన్ని మొదట గూగుల్స్‌ మ్యాప్స్‌ బయటపెట్టింది. గూగుల్ మాప్స్‌ ద్వారా అరేబియా సముద్రంలో ఓ దీవి లాంటి నిర్మాణాన్ని మొదట ఓ టూరిజం సంస్థ గుర్తించింది. ఆ తర్వాత ఈ కొత్త దీవి పై అనేక మంది పరిశోధనలు ప్రారంభించారు. కొందరు ఔత్సాహికులు సొంతగా ఈ దీవి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ స్టడీస్‌ వర్శిటీ ఈ కొత్త దీవిపై పరిశోధన ప్రారంభించింది.


గూగుల్ మాప్స్ లో ఈ దీవిని గుర్తించిన టూరిస్టు సంస్థ దాని గురించి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది. దీంతో ఈ రహస్య దీవి విషయంపై చర్చ మొదలైంది. ఈ కొత్త దీవి కొచ్చి తీరానికి ఏడు కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఈ దీవి 8 కిలో మీటర్ల పొడ‌వు, మూడున్నర మీటర్ల వెడ‌ల్పులో ఉన్నట్టు ఆ టూరిజం సొసైటీ చెప్పింది. అంతే కాదు.. ఈ దీవి సంగతేంటో తేల్చండి అంటూ కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ స్టడీస్‌కు ఓ లెటర్ రాసింది.


ఇంతకూ ఈ దీవి ఏంటి.. ఇది ఎప్పటి నుంచి ఉంది.. కొత్తగా ఏర్పడిందా.. పాతదేనా.. ఇక్కడ ఏం ఉన్నాయి.. అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కేరళ యూనివర్సిటీ ఆఫ్‌ ఫిషరీస్‌ అండ్‌ ఓషియన్‌ స్టడీస్‌ నివేదిక వస్తే గానీ ఓ క్లారిటీ రాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: