జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే రాహుల్ గాంధీ ఆలోచనలో ప్రధానంగా మార్పు రావాలి అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. రాహుల్ గాంధీ ప్రసంగాలు విషయంలో అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేసే విషయంలో రాహుల్ గాంధీ ఆలోచన మారకపోతే కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. రాహుల్ గాంధీలో ప్రతిభ ఉన్నా సరే ఆయన నాయకుడిగా ప్రూవ్ చేసుకునే విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారు అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది.

దీన్ని రాహుల్ గాంధీ అధిగమించాలి అంటే కచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకునే విషయంలో తీసుకునే జాగ్రత్తలే కీలకమవుతాయి అనే అభిప్రాయం ఉంది. వాస్తవానికి మోడీని దేశం కోసం పుట్టిన వ్యక్తిగా బీజేపీ జనాలు అందరూ చెప్తూ ఉంటారు. వాస్తవానికి బీజేపీలో ఒక్క వాజ్ పేయి ని మినహాయిస్తే దేశం కోసం పనిచేసిన నాయకులు చాలా తక్కువగా ఉన్నారు. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన నాయకులు కూడా బీజేపీలో ఎక్కడో ఒకరిద్దరు కనపడుతూ ఉంటారు. అంతేగాని అగ్ర నాయకులు ఎవరూ కూడా దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే బీజేపీ లో లేదు అనే మాట అందరికీ తెలిసిందే అనేది రాజకీయ పరిశీలకులు మాట.

మోడీ కేవలం కుటుంబాన్ని వదిలేసి వచ్చారు కాబట్టి ఆయనను దేశభక్తుడిగా దేశం కోసం పుట్టినట్టుగా బీజేపీ కార్యకర్తలు నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. భార్యను వదిలేస్తే దేశం కోసం పుట్టినట్టు అవుతుందా అనేది కూడా కొంతమంది ప్రశ్న. మోడీ కేవలం కుటుంబాన్ని మాత్రమే వదిలేశారని ఆయన వ్యక్తిగత విలాసాలు ఏమి వదులుకో లేదని చాలామంది అంటూ ఉంటారు. కాబట్టి రాహుల్ గాంధీ ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్ళే విధంగా ప్రసంగాలు చేయడమే కాకుండా రాజకీయాల్లోనే తన నానమ్మ అదే విధంగా తన తండ్రి ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు అనే విషయాన్ని రాహుల్ చెప్పాలని, అదేవిధంగా మీడియా ముందు కన్నీళ్లు పెట్టించే విధంగా ప్రసంగాలు ఉండాలని, సోషల్ మీడియాలో కూడా రాహుల్ గాంధీ రాతలు అదే విధంగా ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: