ఒక అమాయకుడి పై పోలీసులు అక్రమం గా రౌడీషీట్ తెరిచారు అంటూ ఆరోపించారు పైడేరు కాలువలో వైకాపా నేతలు యదేచ్చగా మట్టి మాఫియా చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు ఇక ఈ అక్రమాలను ప్రశ్నించినందుకు మల్లికార్జున్ పై కక్ష పూరితంగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలా వేధింపులకు గురైన ఎస్సీ యువకుడికి న్యాయం చేయాల్సింది పోయి.. అటు పోలీసులు సైతం అధికార పార్టీ నాయకులతో చేతులు కలిపి కుమ్మక్కవడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రం లో పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ లేదు అనే విధంగానే ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఉంది అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమాయకుడైన మల్లికార్జున పై దాఖలైన తప్పుడు కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అసలైన నేరస్తుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక అమాయకుడైన మల్లికార్జున్ ను తప్పుడు కేసులో ఇరికించడానికి అధికార పార్టీ నేతలతో చేతులు కలిపిన పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు.