ఇక ఇప్పుడు కేసీఆర్కు హుజురాబాద్ ఉప ఎన్నిక రూపంలో మరో అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది. ఉప ఎన్నిక ఏదైనా కేసీఆర్ వార్ వన్ సైడ్ చేసుకుంటూ వస్తున్నా హుజూరా బాద్ విషయంలో మాత్రం ఆందోళన స్టార్ట్ అయ్యిందట. ఇప్పటి వరకు ఏ ఉప ఎన్నిక అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందితే వచ్చినవే. అయితే హుజూరా బాద్ ఉప ఎన్నిక ఇందుకు పూర్తి భిన్నం. కేసీఆర్ ఇది ఏరికోరి తెచ్చుకుంటున్న ఉప ఎన్నిక అనే చెప్పాలి. నిన్నటి వరకు ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవిని వదులు కోవడంతో పాటు టీఆర్ ఎస్కు రాజీనామా చేశాక వస్తోన్న ఉప ఎన్నిక.
పైగా ఈటలకు హుజూరా బాద్ కంచుకోట. ఆయన వివాద రహితుడు అన్న పేరుంది. ఇక కేసీఆర్ ఆయనకు అన్యాయం చేశారన్న టాక్ ప్రజల్లోకి బలంగా వెళ్లి పోయింది. విచిత్రం ఏంటంటే గతంలో వైఎస్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలను కూడా ఎదుర్కొని ఈటల ఘనవిజయం సాధించారు. ఈటల రాజీనామా చేశాక స్థానికంగా టీఆర్ ఎస్ తన బలం, బలగాన్ని మోహరించి ఎంత హంగామా చేస్తున్నా కూడా పట్టు దొరకడం లేదు. విచిత్రం ఏంటంటే అసలు ఇప్పటి వరకు అక్కడ టీఆర్ ఎస్ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థి కూడా దొరకడం లేదు. ఇక ఇంటిలిజెన్స్ రిపోర్టులు కూడా ఫలితం తేడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడంతో కేసీఆర్ స్వయంగా ఇక్కడ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లేందుకు రెడీ అయిపోయారు.