అయితే ఈ వివాదంపై కేంద్రం గత కొన్ని రోజులుగా మౌనం వహిస్తోంది. అలాగే ఇప్పటి వరకు తన అభిప్రాయం తెలయజేయలేదు. తాజాగా ఇదే వ్యవహారంపై కేంద్రం స్పందించింది. అంజనాద్రి ని ఆంజనేయుని జన్మస్థలంగా కేంద్రం ప్రభుత్వం తీసుకోలేదని కేంద్ర సాంస్కృతిక పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా జాతీయ స్థాయిలో హనుమంతుని జన్మస్థలంగా ప్రకటించలేమని తేల్చిచెప్పింది.
అయితే రామబంటు ఆంజన్న జన్మస్థలంపై కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హనుమంతుని జన్మస్థలం ప్రశ్నపై ఎన్నో సమాధానాలు.. మరెన్నో అనుమానాలు.. టీటీడీ అంజనాద్రియే ఆంజన్న జన్మస్థలమని, తీర్థ క్షేత్ర ట్రస్టు కిష్కంద కొండలోనే హనుమంతుడు జన్మించాడంటున్నారు. కొందరు మాత్రం జార్ఖండ్, మరి కొందరు మహారాష్ట్రలోనే హనుమంతుడు పుట్టాడని వాదనలు వినిపిస్తున్నారు.