ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సెక్యూరుటీ కోస‌మ‌ని తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వ‌ద్ద ఉన్న ఇళ్ల‌ను అధికారులు ఖాళీ చేపిస్తున్నారు.అయితే త‌మ‌కు ప్ర‌త్య‌మ్నాయంగా ఏర్పాట్లు చేయ‌కుండానే ఇళ్లు ఖాళీ చేపించ‌డంపై నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగారు.సీఎం నివాసానికి ద‌గ్గ‌రిగా ఉన్న అమ‌రారెడ్డి కాల‌నీ వాసుల‌ను అధికారులు ఖాళీ చేపిస్తున్నారు.అదే కాల‌నీలో నివాస‌ముంటున్న శివ‌శ్రీ అనే యువ‌తి ఆందోళ‌నకు మ‌ద్ద‌తుగా నిలిచి త‌మకున్యాయం చేయాలంటూ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసింది.అయితే ఇదే విష‌యాన్ని శివ‌శ్రీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని క‌లిసి త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాలిని ఆయ‌న కోరాన‌ని అప్ప‌టి నుంచి త‌న‌కు బెద‌రింపులు మొద‌లైయ్యాయ‌ని ఆమె ఆరోపిస్తుంది.ఆందోళ‌న చేసినందుకు తాడేప‌ల్లి పోలీసులు త‌న‌ను పోలీస్ స్టేష‌న్‌కు పిలిచి బెదిరిస్తున్నార‌ని యువ‌తి ఆరోపిస్తుంది.విచార‌ణ పేరుతో పోలీస్ స్టేష‌న్‌కు పిలిచి ఉద‌యం ఆరు గంట‌ల నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు స్టేష‌న్‌లో ఉంచి మాన‌సికంగా వేధించారంటూ ఆమె ఆరోప‌ణ‌లు చేసింది.ఆందోళ‌న చేయ‌డానికి తానే కార‌ణ‌మంటూ పోలీసులు బెదిరిస్తున్నార‌ని...స్థానిక జ‌న‌సేన నాయ‌కురాలు సుంక‌ర ప‌ద్మ రావడంతో పోలీసులు త‌న‌ను విడిచి పెట్టార‌ని బాధితురాలు తెలిపింది.ఈ రోజుకి త‌న‌కు బెదిరింపు కాల్స్ వ‌స్తున్నాయ‌ని శివ‌శ్రీ తెలిపింది.

అయితే ఈ రోజు కూడా విచార‌ణ పేరుతో తాడేప‌ల్లి పోలీసులు శివ‌శ్రీని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.నిన్న అమ‌రారెడ్డి కాల‌నీలో ఓ వృద్దురాలి ఇళ్లుని ఖాళీ చేయిస్తున్న అధికారుల‌ను శివ‌శ్రీ అనే యువ‌తి అడ్డుకుంది.అయితే అక్క‌డే ఉన్న శివాజీ అనే వ్య‌క్తి త‌న‌పై దాడి చేశాడ‌ని శివ‌శ్రీ ఆరోపిస్తుంది.త‌న‌కు మ‌ద్ద‌తుగా వ‌చ్చిన వారంద‌రిపై శివాజీ అనే వ్య‌క్తి దుర్భాష‌లాడిన‌ట్లు ఆమె ఆరోపిస్తుంది. త‌న కుటుంబానికి ప్రాణ‌హాని ఉందంటూ రెండు రోజుల క్రితం విడియోని విడుద‌ల చేసింది. అయితే దాడి చేసిన వ్య‌క్తిని పోలీసులు చ‌ర్య‌లు తీసుకోకుండా శివ‌శ్రీని ఉద‌యం ఆరుగంట‌ల‌కే స్టేష‌న్‌కి రావాలంటూ సీఐ హుకుం జారీ చేశారు. దీంతో శివ‌శ్రీకి మ‌ద్ద‌తుగా అఖిల‌ప‌క్ష నేత‌లు భారీగా తాడేప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కి చేరుకున్నారు.అమ‌రారెడ్డి కాల‌నీ నిర్వాసితుల‌పై పోలీసులు అక్ర‌మ‌కేసులు పెడుతున్నారని అఖిల ప‌క్ష నేత‌లు

ఆరోపిస్తున్నారు.గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ వివేక్‌యాద‌వ్‌ను బాధితులు క‌లిశారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ కలెక్ట‌ర్‌కి విన‌తిప‌త్రం ఇచ్చారు.ఇటీవ‌ల సీఎం నివాసానికి ద‌గ్గ‌రగా ఉన్న ఇళ్ల‌ను ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.కానీ త‌మ‌కు ప్ర‌త్యామ్నాయంగా ఏర్పాట్లు చేయ‌కుండా ఇప్ప‌టికిప్పుడు ఎక్క‌డికి వెళ్లాలంటూ బాధితులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ycp