ఇక 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు సతీష్ రెడ్డి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు నమ్మిన వాళ్ల కోసం వైఎస్ కుటుంబం అండగా నిలుస్తుందని ప్రశంసల వర్షం కురిపించేశారు. ఆయన దశాబ్దాలు గా వైఎస్ కుటుంబంతో బద్ధ శత్రువుగా రాజకీయాలు చేశారు. అలాంటిది అదే వైఎస్ కుటుంబాన్ని కాశానికి ఎత్తేయడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకోవడమే మిగిలి ఉందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన సైలెంట్ గా ఉన్నారు. ఆయన వ్యవసాయంతో పాటు తెలంగాణలో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారట.
వైసీపీలో చేరేందుకు ఇష్ట పడడం లేదని కడప జిల్లా టాక్ ? ఇప్పటికే అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వెళ్లారు. అక్కడ ఆయనకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఈ విషయాన్ని చూసిన సతీష్ రెడ్డి వైసీపీలోకి వెళ్లడం కంటే ప్రశాంతంగా ఉండి తన పని తాను చేసుకుంటే బెటర్ అన్న నిర్ణయంతో ఉన్నారట. దీంతో పాటు ప్రస్తుతం ఏపీలో వైసీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారుతుందనే ప్రచారం జరుగుతోం ది. ఈ ప్రచా రం కూడా ఆయన డైలమాలో ఉండడానికి కారణం అంటున్నారు.