దీనిని దేశంలోనే తొలి అరుదైన కరోనా కేసుగా నిర్దారించడంతో పాటు దీనిని తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసుగా వైద్య నిపుణులు నిర్దారించారు. విచిత్రం ఏంటంటే ఆ మహిళా డాక్టర్ ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నారు. అయినా ఆమెకు రెండు వేరియంట్లు వచ్చాయంటే ... వ్యాక్సిన్ వేసుకున్నవారు కూడా కరోనా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయం చెప్పకనే చెపుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా రావడం మాత్రం ఆగడం లేదు.
ఆమెకు రెండు కరోనా వేరియంట్లు వచ్చాయన్న విషయాన్ని నమ్మలేని డాక్టర్లు మరోసారి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లోనూ ఆమెకు రెండు వేరియంట్లు సోకిన విషయం నిర్దారణ అయ్యింది. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అంటున్నారు. భయపడాల్సిన పనిలేదని వైద్యులు చెపుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితమే యూరప్ లోని బెల్జియంకు చెందిన 90 ఏళ్ల ఓ వృద్ధురాలిపై కూడా డబుల్ వేరియంట్లు దాడి చేశాయి.
అయితే ఆమె వయస్సు 90 సంవత్సరాలు కావడంతో ఆమె ఆ ధాటికి తట్టుకోలేక చనిపోయింది. అయితే ఎన్ని వేరియంట్లు ఉన్నా మనిషి శరీరం దానిని ఎదుర్కొంటే వచ్చే ఇబ్బంది లేదని వైద్యులు చెపుతున్నారు.