దాదాపు 8 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ధర్నా చేస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలనేది రైతుల ప్రధాన డిమాండ్. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ... అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. అటు కేంద్రం కూడా దిగిరాకపోవడంతో... తమ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించారు. సింఘు సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతుల.... రోజుకు 200 మంది చొప్పున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనాలని నిర్ణయించారు. మాక్ పార్లమెంట్లో మొదటి రెండు రోజుల్లో ఏపీఎంసీ యాక్ట్పై చర్చించనున్నారు. తర్వాత మిగిలిన చట్టాలపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు రైతు సంఘం నేతలు. ఈ మాక్ పార్లమెంట్కు అన్ని పార్టీల రాజకీయ నేతలను ఆహ్వానిస్తామన్నారు. ఆయా పార్టీల స్టాండ్ను వాళ్లు నిరభ్యంతరంగా మాక్ పార్లమెంట్లో తెలియజేయవచ్చని రైతులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులను కలిసిన రైతు సంఘాల నేతలు... పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అటు వైపు వెళ్లమని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ప్రతి రోజు శాంతియుతంగానే తమ నిరనస ఉంటుందని... రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ నేతలు వెల్లడించారు.
దాదాపు 8 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే ధర్నా చేస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలనేది రైతుల ప్రధాన డిమాండ్. ఇప్పటికే ప్రభుత్వంతో పలు మార్లు చర్చలు జరిపినప్పటికీ... అవి సత్ఫలితాలు ఇవ్వలేదు. అటు కేంద్రం కూడా దిగిరాకపోవడంతో... తమ నిరసనను మరింత తీవ్రతరం చేయాలని రైతులు నిర్ణయించారు. సింఘు సరిహద్దుల్లో ధర్నా చేస్తున్న రైతుల.... రోజుకు 200 మంది చొప్పున ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొనాలని నిర్ణయించారు. మాక్ పార్లమెంట్లో మొదటి రెండు రోజుల్లో ఏపీఎంసీ యాక్ట్పై చర్చించనున్నారు. తర్వాత మిగిలిన చట్టాలపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు రైతు సంఘం నేతలు. ఈ మాక్ పార్లమెంట్కు అన్ని పార్టీల రాజకీయ నేతలను ఆహ్వానిస్తామన్నారు. ఆయా పార్టీల స్టాండ్ను వాళ్లు నిరభ్యంతరంగా మాక్ పార్లమెంట్లో తెలియజేయవచ్చని రైతులు వెల్లడించారు. ఢిల్లీ పోలీసులను కలిసిన రైతు సంఘాల నేతలు... పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అటు వైపు వెళ్లమని లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ప్రతి రోజు శాంతియుతంగానే తమ నిరనస ఉంటుందని... రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ మహాసంఘ్ నేతలు వెల్లడించారు.