2016 సంవత్సరం నాటికి, ఎన్ఎస్ఓ అనే ఒక స్పై వేర్ గ్రూప్ కేవలం ఈ సాఫ్ట్ వారే ఇన్స్టలేషన్ కొరకు 3.7 కోట్ల రూపాయలు ఛార్జ్ చేసినట్లుగా సమాచారం ఉంది. మరియు ఒక 10 ఐఫోన్ లను లేదా ఆండ్రాయిడ్ ఫోన్ లను ట్యాప్ చేయడానికి 4.84 కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తారని తెలుస్తోంది. అంతే కాకుండా 5 బ్లాక్ బెర్రీ ఫోన్స్ ను ట్యాప్ చేయడానికి 3.7 కోట్ల రూపాయలు తీసుకోనున్నారు. 5 సింబియన్ యూజర్ల ఫోన్ లను ట్యాప్ చేయడానికి 2.25 కోట్ల రూపాయలను ఛార్జ్ చేయనున్నారు. ఇలా కాకుండా ఇంకా ఎక్కువ మొత్తంలో ట్యాప్ చేయాలంటే అందుకు సరిపడా చార్జీలను తీసుకుంటారని తెలుస్తోంది.
ఇవి కాకుండా కస్టమర్ ఇచ్చిన టార్గెట్ కోసం సంవత్సరం మొత్తం అయిన ఖర్చులో 17 శాతం వరకు ఫీజు చెల్లించవలసి వస్తుంది. మరియు ఏమైనా సాఫ్ట్ వేర్ లో రిపేర్ లు వస్తే వాటికి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. అయితే మన దేశంలో ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా 300 టార్గెట్స్ ను ట్యాప్ చేయడానికి 56 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈ సేవలను అందుకుంటున్న వారిలో దాదాపుగా 50 శాతం వరకు బిజినెస్ మాన్ లని తెలుస్తోంది. మరియు 11 శాతం మిలిటరీ రంగానికి చెందిన వారు, 38 శాతం వరకు న్యాయవ్యవస్థకు చెందినవారుగా ఒక వెబ్సైటు తెలిపింది. ఈ విధంగా ఇజ్రాయెల్ దేశంలోని సైబర్ కార్యకలాలు నిర్వహించే కంపెనీలు ప్రతి సంవత్సరం 1 బిలియన్ డాలర్ లకు పైగా సంపాదిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.