మహారాష్ట్రలోని కోల్హాపూర్, రాయ్ గఢ్, రత్నగిరి, పాల్గర్, థానే, నాగ్ పూర్ పట్టణాలపై వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆయా పట్టణాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయ చర్యల్లో పాల్గొనే సిబ్బంది కూడా వరద ఉధృతికి భయపడుతోందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాయ్ గఢ్ జిల్లాలోనే శుక్రవారం ఒక్కరోజే 47 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సతారా జిల్లాలో కూడా వరదల కారణంగా శుక్రవారం 27 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరద బీభత్సం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వరదల కారణంగా ఇప్పటికే ముంబై లోకల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 120 విమానాలను అధికారులు దారి మళ్లించారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలోని కోల్హాపూర్, రాయ్ గఢ్, రత్నగిరి, పాల్గర్, థానే, నాగ్ పూర్ పట్టణాలపై వరుణుడు విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఆయా పట్టణాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయ చర్యల్లో పాల్గొనే సిబ్బంది కూడా వరద ఉధృతికి భయపడుతోందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్క రాయ్ గఢ్ జిల్లాలోనే శుక్రవారం ఒక్కరోజే 47 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో గల్లంతైనట్లు తెలుస్తోంది. సతారా జిల్లాలో కూడా వరదల కారణంగా శుక్రవారం 27 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటికే సుమారు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. వరద బీభత్సం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వరదల కారణంగా ఇప్పటికే ముంబై లోకల్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 120 విమానాలను అధికారులు దారి మళ్లించారు. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.