గూగుల్ టాక్ : ఆ ఎంపీకి ఫ్యాన్స్ ఎక్కువ ఎందుకు?

క‌ష్టం అంటే స్పందించే నాయ‌కుల‌కు
ఇవాళ మంచి క్రేజ్
త‌న ప‌రిచ‌యాల‌నూ, స్నేహాల‌ను
వినియోగించి సేవ చేసే నాయ‌కులకు
ఇవాళ గుడ్ విల్
అనేందుకు ఉదాహ‌ర‌ణ శ్రీ‌కాకుళం ఎంపీ రామూ


అంత‌మంది ఫ్యాన్స్ మీకెందుకు అని అడిగాను ఓ సారి ఎంపీ రామూను.. ఏమో అండి తెలియ‌దు.. మీరు ఎర్ర‌న్న అంత పేరు తెచ్చుకోవాలి అని చెప్పాను..అలానే అన్నారు.. ఈ కోవిడ్ నుంచి కొంద‌రిని ర‌క్షించి వారికో దారి ఇచ్చారు ఎంపీ రామూ.. వారి జీవ‌నానికి ఆధారం అయ్యారు ఎంపీ రామూ.. ఆంధ్రాలోనూ తెలంగాణ‌లోనూ ఇంకా ప్ర‌వాసాంధ్రుల‌తోనూ ఆయ‌న మంచి ప్ర‌శంస‌లు  అందుకున్నారు.. అందుకు కార‌ణం ఆయ‌న  చేసిన సేవా కార్య‌క్ర‌మాలే..


 

శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆస్ప‌త్రిలో నల‌భై ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఓ ఐసీయూ వార్డు ఏర్పాటు చేయించారు రామూ.. ఇందులో ప‌ది ప‌డ‌క‌లు ఉంటాయి.. త‌న‌కు తెల్సిన ఎన్ ఆర్ ఐ మిత్రులు., ఇత‌ర దాత‌లు హైద్రాబాద్ లో ఉన్న సేవా సంస్థ‌లు ఇందుకు ఊతం ఇచ్చాయి.. ఇవాళ ఉద‌యం ఆ ఐసీయూ వార్డ్ ను క‌లెక్ట‌ర్ తో క‌లిసి ప్రారంభించి, రోగుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.




 

క‌రోనా సెకెండ్ వేవ్ లో  కూడా ఆక్సిజ‌న్ కొర‌త‌తో అల్లాడిన రోగుల‌కు సిలిండ‌ర్ల‌ను అందించేందుకు  ఓ స్వ‌చ్ఛంద సంస్థ సాయం తీసుకున్నారు ఎంపీ రామూ.. అదేకాదు ఇంకా చాలా ప‌నులు లాక్డౌన్ లో చేశారు..ఇవ‌న్నీ ప్ర‌జా  ప్ర‌యోజ‌నం కోసమే.. త‌మ కార్యాల‌యంలో ఓ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి మరీ! ఈ సేవాకార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు.. ఎవ్వ‌రు ఏ స‌మ‌యంలో కాల్ చేసినా స్పందించే రామూ త‌న‌వంతుగా లాక్డౌన్ లో హైద్రాబాద్ లో చిక్కుకున్న శ్రీ‌కాకుళం వారికీ  స‌ర‌కులు అందించే ఏర్పాటు చేశారు. అలానే ఇంకొన్ని మంచి ప‌నులు చేశారు..చేస్తున్నారు. అందుకే ఆయ‌న‌కు ఫ్యాన్స్ ...

మరింత సమాచారం తెలుసుకోండి: