ఈ క్రమంలో గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లోకేష్ ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకుంటూనే బరువు తగ్గారు. అంతేకా దు.. తెలుగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ దగ్గర పాఠాలు సైతం నేర్చుకు న్నారని.. తెలుగులో ధారాళంగా.. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడే విధానంపైనా.. లోకేష్.. శిక్షణ పొందారని.. ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేష్ లుక్.. బాగానే ఉందనే టాక్ వినిపించింది. అయినప్పటికీ.. ఆశించిన విధంగా లోకేష్ పుంజుకోలేక పోయారని.. పార్టీలోనే విమర్శలు వచ్చాయి.
సబ్జెక్టు పెంచుకోవాలని.. సీనియర్ల నుంచి గుస గుస వినిపించింది. అయితే.. ఆదిలో ఈ రెస్పాన్స్ను సీరియస్గా తీసుకున్న లోకేష్ తర్వాత.. తనను తాను మార్చుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే సబ్జెక్టుపై గట్టి పట్టు పెంచుకున్నారు. ఇప్పుడు ఆయన హావ భావాలు కూడా సమయానికి తగిన విధంగా ఉన్నా యని.. పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ పరంగా ఆయన అందరినీ కలుపుకొని పోయేందుకు, ముఖ్యంగా యువతలో క్రేజ్ పెంచుకునేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ఇఇ కూడా సక్సెస్ అయిందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం లోకేష్ చేస్తున్న ప్రసంగాలకు మంచి లైకులు పడడంతోపాటు ఫాలోయింగ్ కూడా పెరగడం.. టీడీపీలో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. సీనియర్ల మాట ఎలా ఉన్నప్పటికీ.. యువతలో ఫాలోయింగ్ పెరిగిందని తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యమాల విషయంలో లోకేష్ చురుగ్గా ఉండడం ఆయనకు కలిసి వస్తోందని అంటున్నారు.. మరి దీనిని లోకేష్ కొనసాగిస్తారో.. లేదో చూడాలి.