దేశంలోని పలు నగరాల్లోని సిగ్నల్స్ వద్ద, బస్టాండ్స్, రైల్వేస్టేషన్స్, చౌరస్తాలో బిక్షం కోసం అడుక్కునే వాళ్లను చూస్తూనే ఉంటాం. వారు ఏ పని తోచక, రాక పొట్టకూటి కోసం యాచిస్తూ ఉంటారు. దీంతో వారికి కొంతమంది ఎంతోకొంత డబ్బులు, ఆహారం అందిచ్చి సహాయం చేస్తు ఉంటారు. దేశంలో లక్షల సంఖ్యలో బిచ్చగాళ్లు ఉంటారు. ఇందులో కొంతమంది అడుక్కొవడం వ్యాపరంగా మార్చుకున్నారు. అయితే ఇలా బిచ్చమెత్తిన కొందరిని చూస్తే ఆశ్చర్యపడాల్సిందే. అయితే వీరి సంపాదన బడా వ్యాపారస్తులకు ఏమీ తీసుపోదు. ఇలాంటి వారిలో దేశంలోని ముగ్గురు బిచ్చగాళ్ల గురింఇ తెలుసుకుందాం.
భారతదేశపు ధనవంతులైన బిచ్చగాళ్ల గురించి తెలుసుకుంటే షాక్కు గురికాక తప్పదు. వీరికి ధనవంతుల్లాగే అన్ని సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం ఉంటుంది. బ్యాంకులో డబ్బులు కూడా చాలానే ఉంటయి.. అయినా వాళ్లు వీధుల్లతో బిక్షం అడుక్కుంటూనే ఉంటారు. దేశంలో ఉన్న ధనిక బిచ్చగాళ్ల జాబితాలో మొదటిగా భారత్ జైన్ పేరు ఉంటుంది. ఇతడు ఎక్కువగా ముంబైలోని పరేల్ ప్రాంతంలో యాచిస్తాడు. ఓ నివేదిక ప్రకారం అతని వద్ద దాదాపు రూ.70 లక్షలు విలువ చేసే రెండు ఫ్లాట్లు ఉన్నాయి. బిక్షాటన ద్వారా నెలనెల సుమారు 75,000 రూపాయలు సంపాదిస్తాడు.
దేశంలోని ధనిక బిచ్చగాళ్ల జాబితాలో రెండో వరుసలో కలకత్తాకు చెందిన లక్ష్మి ఉంది. ఆమె 1964 నుంచి అంటే 16 సంవత్సరాల వయసులో కోల్కతాలో యాచించడం మొదలు పెట్టింది. 50 సంవత్సరాలకు పైగా భిక్షాటన ద్వారా లక్షల రూపాయలు జమ చేసింది. ఇప్పటికీ ప్రతిరోజు తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు యాచించడం ద్వారా సంపాదిస్తుంది. అదే విధంగా ముంబైలో నివసించే గీతా కూడా గొప్ప బిచ్చగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకుంది. ముంబైలోని చార్ని రోడ్ వద్ద ఆమె యాచిస్తూ ఉంటుంది. గీతకు సొంతంగా ఓ ఫ్లాట్ ఉందని, ఆమె తన సోదరుడితో కలిసి నివసిస్తుందని చెబుతారు. గీత యాచించడం ద్వారా ప్రతిరోజూ సుమారుగా రూపాయలు 15 వందలు సంపాదిస్తుంది అని తెలుస్తోంది.