ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మరియు ఏపీ డీజీపీలపై  టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి మరియు ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ఇన్ ఛార్జ్  బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోశాంతిభద్రతలు డీజీపీ ఆదేశాలతో కాకుండా, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల ప్రకారం అమలు అతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.  జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది అమలు చేయడమే డీజీపీ విధిగా మారిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బుద్ధా వెంకన్న. 

డీజీపీ అనే పదానికి డైరెక్ట్ గా జగన్ కు పనిచేసే అధికారి అనే అర్థం వచ్చేలా సవాంగ్ పనిచేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో డీజీపీ గౌతం సవాంగ్‌ పైన కూడా ఇంటెలిజెన్స్‌ నిఘా నడుస్తోందని ఆరోపణలు చేశారు. డీజీపీగా కంటే జగన్‌ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన సవాంగ్‌ ఫోనే కట్‌ అయిపోయే స్థితికి వచ్చిందని పేర్కొన్నారు బుద్ధావెంకన్న.  డీజీపీ పై ఇంటిలిజెన్స్ వర్గాలు నిఘా పెట్టాయని పోలీసులు అనుకుంటున్నారని ఆరోపించారు.. జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేయబట్టే, నేడు డీజీపీ పరిస్థితే ప్రశ్నార్థకంగా మారిందని చురకలు అంటించారు బుద్ధా వెంకన్న.  


 టీడీపీ సహా, ఇతర విపక్షాలు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులకు డీజీపీ ఏనాటి కైనా సమాధానం చెప్పాల్సిందేనని హెచ్చరించారు.  టీడీపీ ప్రభుత్వం వచ్చిన మర్నాడు, సవాంగ్ ఎక్కడున్నా సరే, తాను చేసిన తప్పులకు కోర్టు బోనులో నిలబడక తప్పదని వార్నింంగ్‌ ఇచ్చారు బుద్ధా వెంకన్న. రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సీఎంవో ఆదేశాలకు లోబడే పనిచేస్తున్నాయి తప్ప , చట్ట ప్రకారం కాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తానే సర్వమైనట్లు, తానే రాజు –తానే మంత్రి అన్నట్లు వ్యవహరిస్తున్నాడని నిప్పులు చెరిగారు బుద్ధా వెంకన్న.  వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని పేర్కొన్న ఆయన...వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే ఏపీ ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

dgp