ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఓ విషయం స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్రం సంక్షోభంలో ఉంది అని చెప్పి, సంబంధిత సమస్యల నివారణకు సీఎం ఏ విధంగా కృషి చేస్తున్నారో చెప్పారు. చంద్రబాబు హయాంలోనే అప్పులు ఉన్నాయి అని, తాము వాటిని తీరుస్తూ ముందుకు పోతున్నామని దాదాపు మూడున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆయన లెక్క తేల్చారు. అదేవిధంగా తాము ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం వెతుకుతుంటే టీడీపీ, బీజేపీ సహకరించకపోగా తమకు పక్కలో బల్లెంలా మారాయన్నది ఆయన అభిమతం..రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పించడంలో బీజేపీ నేతల చొరవ ఏమీ లేదని ఒకవేళ అలాంటి చర్య ఒకటి తీసుకుంటే మేలు అని ఆయన చెప్పారు.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఓ విషయం స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా రాష్ట్రం సంక్షోభంలో ఉంది అని చెప్పి, సంబంధిత సమస్యల నివారణకు సీఎం ఏ విధంగా కృషి చేస్తున్నారో చెప్పారు. చంద్రబాబు హయాంలోనే అప్పులు ఉన్నాయి అని, తాము వాటిని తీరుస్తూ ముందుకు పోతున్నామని దాదాపు మూడున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని ఆయన లెక్క తేల్చారు. అదేవిధంగా తాము ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గం వెతుకుతుంటే టీడీపీ, బీజేపీ సహకరించకపోగా తమకు పక్కలో బల్లెంలా మారాయన్నది ఆయన అభిమతం..రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇప్పించడంలో బీజేపీ నేతల చొరవ ఏమీ లేదని ఒకవేళ అలాంటి చర్య ఒకటి తీసుకుంటే మేలు అని ఆయన చెప్పారు.