ఇదిలా ఉండగా నేడు ఈటలకు ముఖ్య అనుచరుడుగా వ్యవహరించిన దేశిని కోటి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నదేశిని కోటి భార్య దేశిని స్వప్న కూడా తాను టీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లు ఈ రోజు ఉదయం విలేకరులకు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నెల 23వ తేదీన తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ (ఎస్సీ కార్పోరేషన్ ) చైర్మన్ గా బండా శ్రీనివాస్ను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమ సారథి కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీలో 2001 లోనే చేరి కేసీఆర్ ఆదేశాల మేరకు స్వరాష్ట్ర ఉద్యమాల్లో బండా శ్రీనివాస్ చురుకుగా పాల్గొన్నారు. హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షునిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా పలు హోదాల్లో ఆయన పనిచేశారు. ఇదే క్రమంలో ఈటలకు సన్నిహతంగా ఉంటూ అనుచరుడిగా మారాడు.