సైబరాబాద్ పరిధిలో సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో.. ఇవాళ   డిస్ట్రిబ్యూషన్ మేళ నిర్వహించారు. డిస్ట్రిబ్యూషన్ మేళ అంటే ఏదో అనుకునేరు.. చోరీ అయిన వస్తువులను తిరిగి ఆ బాధితులకు ఇవ్వడమే.. ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం. డిస్ట్రిబ్యూషన్ మేళ సందర్భంగా  సీపీ సజ్జనార్ మాట్లాడారు.  సాధారణంగా చోరీ కేసుల్లో పోయిన సొత్తు వస్తుందా లేదా అన్న మీమాంస ఉండేది.. నేటితో అది తొలగిపోయిందన్నారు. పొగొట్టుకున్న సొమ్మును ఇప్పించాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను.. ఆ ఇనిషియేటివ్ ఈ రోజు సాధ్యం అయిందని పేర్కొన్నారు. 

దీన్ని రెగ్యులర్ గా నిర్వహించేలా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు.  176 కేసులో కోటిన్నర సొత్తును నేడు బాధితులకు తిరిగి ఇస్తున్నామని చెప్పారు. కేసు పెట్టడం ఒక ఎత్తు అయితే రికవరీ చేయడం ఇంకో ఎత్తు అని పేర్కొన్నారు.. విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన వారందరికీ అభినందనలు  తెలిపారు సీపీ సజ్జనార్. చోరీ కేసులో సొత్తును తిరిగి ఇప్పించడంలో కోర్టు పోలీస్  ఆఫీసర్స్ పాత్ర కీలకమైందన్నారు. చోరీ కేసులో సొత్తును తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు సీపీ సజ్జనార్.

పోలీస్ వ్యవస్థలో  చోరీ అయిన ప్రాపర్టీ ఇప్పించడం ఒక భాగమన్నారు. బాధితులకు ఇక నుండి శ్రమ లేకుండా చోరీ అయిన సొత్తును  కోర్టు నుండి తిరిగి ఇప్పించే బాధ్యతను సైబరాబాద్ పోలీసులు తీసుకుంటారని ప్రకటన చేశారు సీపీ సజ్జనార్. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చారు. నేరం జరిగాక  ఫిర్యాదు చేయాలి..కానీ అలసత్వం వహించరాదని సూచనలు చేశారు. పిర్యాదు చేస్తే నేరస్తుడిను పట్టుకునే అవకాశం ఉంటుంది.. లేదంటే ఆ నేరస్తుడు మరికొన్ని నేరాలు చేయగలుగుతాడని పేర్కొన్నారు. ఇలాంటి ఇనిషియేటివ్ల  వల్ల ప్రజలకు పోలీసులు పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని తెలిపారు.. సైబరాబాద్ పోలీసులకు ఈరోజు సంతృప్తికర రోజు అని అన్నారు. వచ్చే రోజులలో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ మేళ కంటిన్యూ అవుతుందన్నారు సీపీ సజ్జనార్.

మరింత సమాచారం తెలుసుకోండి: