అయితే ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలని అధికార టీఆర్ ఎస్ పార్టీ కంకణం కట్టకుని ఉందని తెలుస్తోంది. ఉప ఎన్నికల నేపథ్యంలో పలు పథకాలను గులాబీ బాస్ కేసీఆర్ ప్రవేశపెడుతున్నాడు. ఇందులో ముఖ్యంగా `దళిత బంధు` అని చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా దళితుల అభివృద్ది చెందుతారని చెబుతున్నారు సీఎం కేసీఆర్. కానీ ఇది కేవలం ఎన్నికల స్టంట్గానే పలువురు అంటున్నారు. స్వయంగా గులాబీ బాసే `దళిత బంధు`ను ఎన్నికల వ్యూహంగా అమలు చేస్తున్నామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ హుజురాబాద్లో గెలవడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
హుజురాబాద్లో మరో బలమైన సామాజిక వర్గం యాదవులు వీరిని ఆకర్షించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను రంగంలోకి దింపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన రెండో విడత గొర్రెల పంపిణీని కేవలం హుజూరాబాద్లోనే ప్రభుత్వం ప్రారంభిస్తోంది. బుధవారం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇలా అన్ని సామాజిక వర్గాలను ఆకట్టకునేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ వేస్తూనే ఉన్నారు. అయితే స్వరాష్ట్రం ఏర్పడ్డాకా తొలి ముఖ్యమంత్రి దళితుడే ఉంటాడని ప్రకటించిన కేసీఆర్ మాటలు ఇప్పుడు దళిత బందు మైమరిపిస్తుందో చూడాలి.