అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి కరోనా నెమ్మదిగా తన తీవ్రతను తగ్గించుకుంటోంది. త్వరలోనే అన్ని ఐటీ కంపెనీలు తమ విధివిధానాలను తిరిగి ఆఫీసుల నుండి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఉద్యోగులు ఖచ్చితంగా వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇటీవల ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ కోసం ఇఫ్ఫోస్ చేసిన సర్వే ప్రకారం దాదాపుగా మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు వారి పనిని ఇంటి నుండే చేయాలని అనుకుంటున్నారట. ఈ సంస్థ మొత్తం 29 దేశాలలో ఉన్న 12,500 ఉద్యోగస్తులను సర్వే చేసి పలు విషయాలను సేకరించింది. ఒకవేళ కంపెనీ యాజమాన్యాలు ఖచ్చితంగా కార్యాలయం నుండే పనులు చేయాలనే నిబంధన కనుక తీసుకువస్తే 30 శాతం మంది ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెతుక్కుంటారని ఈ సర్వే తెలిపింది.
అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి కరోనా నెమ్మదిగా తన తీవ్రతను తగ్గించుకుంటోంది. త్వరలోనే అన్ని ఐటీ కంపెనీలు తమ విధివిధానాలను తిరిగి ఆఫీసుల నుండి ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంపై ఉద్యోగులు ఖచ్చితంగా వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఇటీవల ప్రపంచ ఆర్ధిక ఫోరమ్ కోసం ఇఫ్ఫోస్ చేసిన సర్వే ప్రకారం దాదాపుగా మూడింట రెండు వంతుల మంది ఉద్యోగులు వారి పనిని ఇంటి నుండే చేయాలని అనుకుంటున్నారట. ఈ సంస్థ మొత్తం 29 దేశాలలో ఉన్న 12,500 ఉద్యోగస్తులను సర్వే చేసి పలు విషయాలను సేకరించింది. ఒకవేళ కంపెనీ యాజమాన్యాలు ఖచ్చితంగా కార్యాలయం నుండే పనులు చేయాలనే నిబంధన కనుక తీసుకువస్తే 30 శాతం మంది ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెతుక్కుంటారని ఈ సర్వే తెలిపింది.