తమ నేతపై ఆరోపణలు సహించని కొంతమంది వైసీపీ కార్యకర్తలు... తిరుగు ప్రయాణంలో ఉన్న దేవినేని కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు ప్రత్యక్షసాక్షుల మాట. వాదనలు శ్రుతి మిుంచడంతో దేవినేని ఉమా వాహనంపై కొందరు రాళ్ల దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి నుంచి మాజీ మంత్రిని కాపాడింది కూడా వైసీపీ నేతలే అని తెలుస్తోంది. దాడి చేస్తున్న తమ పార్టీకి చెందిన కార్యకర్తలను కొందరు స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు దేవినేనికి రక్షణగా నిలిచి... తమ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నట్లుగా తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా వైసీపీ నేతలు బయటపెట్టారు. ఇరువర్గాల నేతలు భారీగా మోహరించిన సమయంలో జి.కొండూరుకు చెందిన వైసీపీ నేతలు పాలడుగు దుర్గాప్రసాద్ సహా మరికొందరు నేతలు అడ్డుగా నిలిచారు. ఈ దాడిలో దుర్గాప్రసాద్ వాహనం కూడా ధ్వంసమైందని స్థానిక వైసీపీ నేతలు వెల్లడించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు కాబట్టే... వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని... అయితే ఈ దాడిని వైసీపీ సీనియర్ నేతలే అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తమ నేతపై ఆరోపణలు సహించని కొంతమంది వైసీపీ కార్యకర్తలు... తిరుగు ప్రయాణంలో ఉన్న దేవినేని కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నట్లు ప్రత్యక్షసాక్షుల మాట. వాదనలు శ్రుతి మిుంచడంతో దేవినేని ఉమా వాహనంపై కొందరు రాళ్ల దాడికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి నుంచి మాజీ మంత్రిని కాపాడింది కూడా వైసీపీ నేతలే అని తెలుస్తోంది. దాడి చేస్తున్న తమ పార్టీకి చెందిన కార్యకర్తలను కొందరు స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. పార్టీ సీనియర్ నేతలు దేవినేనికి రక్షణగా నిలిచి... తమ పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నట్లుగా తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా వైసీపీ నేతలు బయటపెట్టారు. ఇరువర్గాల నేతలు భారీగా మోహరించిన సమయంలో జి.కొండూరుకు చెందిన వైసీపీ నేతలు పాలడుగు దుర్గాప్రసాద్ సహా మరికొందరు నేతలు అడ్డుగా నిలిచారు. ఈ దాడిలో దుర్గాప్రసాద్ వాహనం కూడా ధ్వంసమైందని స్థానిక వైసీపీ నేతలు వెల్లడించారు. టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు కాబట్టే... వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని... అయితే ఈ దాడిని వైసీపీ సీనియర్ నేతలే అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.