ఇక పలు ఎంపీ సీట్లలో పార్టీ తరపున బలంగా పోటీ ఇచ్చే అభ్యర్థులు కూడా లేని దుస్థితి. ముఖ్యంగా నెల్లూరు, ఒంగోలు, తిరుపతి లాంటి చోట్ల టీడీపీ గెలిచి రెండున్నర దశాబ్దాలు అవుతోంది. ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన 22 ఎంపీ సీట్లలో పోటీ చేసిన అభ్యర్థులు చాలా మంది పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఒకరిద్దరు చనిపోయారు. కొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ముఖ్యంగా ఒంగోలు, నెల్లూరు ఎంపీ సీట్లలో టీడీపీ చివరి సారిగా 1999లో మాత్రమే గెలిచింది.
ఇక ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో గత నాలుగు ఎన్నికల్లో ప్రతి ఎన్నికకు క్యాండెట్ను మారుస్తూనే వస్తున్నారు. ఇక చంద్రబాబును, పార్టీని నమ్మి ఎవ్వరూ ఇక్కడ సెట్ కావడం లేదు. ఇక గత ఎన్నికల్లో ఒంగోలులు ఎంపీగా పోటీ చేసి ఓడిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, నెల్లూరులో ఎంపీగా పోటీ చేసి ఓడిన బీద మస్తాన్ రావు ఇద్దరూ కూడా వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇక 2014లో నెల్లూరులో పోటీ చేసిన ఆదాల ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉంటే నాడు టీడీపీ ఎంపీగా ఒంగోలులో పోటీ చేసిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నారు.
దీనిని బట్టి ఇక్కడ పోటీ చేసిన వారు చంద్రబాబును ఎవ్వరూ నమ్మడం లేదు. ఆయనకు సరైన నేతలు లేరనే చెప్పాలి. మరి బాబు కనీసం వచ్చే ఎన్నికలకు ముందుగానే అయినా ఇక్కడ సమర్థులు అయిన నేతలను సెట్ చేస్తారో ? లేదో ? చూడాలి.