ఎప్పుడూ ఏదో విష‌యంలో త‌న వ్యాఖ్య‌ల ద్వారా స‌మ‌స్య‌ల్లో ప‌డుతూనే ఉంటాడు. అత‌డే టెర్ర‌రిస్ట్ కంట్రీగా పేరు పొందిన పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌. అత్యాచారం, మహిళలపై లైంగిక వేధింపుల విషయమై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయ‌న మాటాల‌ను వెనక్కు తీసుకున్నారు. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకూ పెరుగుతుండ‌డంతో గత నెల పాక్ ప్ర‌ధాని మీడియా స‌మావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలోని ప్రలోభాలకు దూరంగా ఉండటం ద్వారా మహిళలపై లైంగిక వేధింపులు జ‌రుగ‌కుండా తగ్గించవచ్చన్నారు. ఆకర్షించే, రెచ్చగొట్టే మహిళల ధోరణుల వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయన్న అర్థంలో ఆయ‌న మాట్లాడిన విష‌యాలు తీవ్ర దుమారం రేపాయి.

 గ‌తంలోనూ  ఈ అంశంపై ఇమ్రాన్ ఖాన్‌ ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఈ క్రమంలోనే అమెరికా మీడియా సంస్థ పీఎస్‌బీ న్యూస్‌ అవర్‌తో తాజాగా పాక్ ప్ర‌ధాని  మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా గతంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల‌పై తన వ్యాఖ్యల విషయంలో వెనక్కు తగ్గారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తే పూర్తిగా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంద‌ని, మ‌హిళ‌ ఎంత రెచ్చగొట్టినా, ఎలాంటి దుస్తులు ధరించినా కూడా చివరికి ఆమే బాధితురాలు అవుతుంది. కాబట్టి, బాధితురాలు ఎప్పుడూ బాధ్యురాలు కాద‌ని వివ‌రించారు. మునిప‌టిలా మరెప్పుడూ బుద్ధి తక్కువ మాట‌లు మాట్లాడు అని తెలిపారు.  గత ఇంటర్వ్యూల్లో తాను ఏం మాట్లాడానన్నది బాగా గుర్తుంద‌న్నారు. ఎప్పుడైనా అత్యాచారానికి పాల్పడిన వ్యక్తే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలకు ఇస్లాం మ‌తం గౌరవ మర్యాదలు ఇస్తుంది అని ఈ స‌ద‌ర్భంగా ఇమ్రాన్‌ పేర్కొన్నారు.

   అయితే పాకిస్తాన్‌లో గ‌త ఆరేండ్ల కాలంలో 22 వేల‌కు పైగా అత్యాచార కేసులు న‌మోద‌య‌య్యాయి. అధికారిక గణాంకాల ప్రకారం పాకిస్థాన్‌లో స‌గ‌టున రోజుకు 11 అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) విడుదలచేసిన ‘గ్లోబల్‌ జెండర్‌ గ్యాప్‌ రిపోర్టు-2021’  వెల్ల‌డించింది. దీని ప్రకారం... లింగ సమానత్వం అత్యంత తక్కువగా ఉన్న దేశాల జాబితాలో పాకిస్థాన్‌ ఏడాదిలో కాలంలోనే రెండు ర్యాంకులు దిగువకు జారిపోయింది. ప్రస్తుతం ఈ జాబితాలోని అట్టడుగు నాలుగు దేశాల్లో ఒకటిగా పాకిస్తాన్ ఉన్నట్లు డబ్ల్యూఈఎఫ్ వివ‌రించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: