మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టుతో కృష్ణా జిల్లా టీడీపీ రాజ‌కీయాలు ఒక్క‌సారిగా హీటెక్కేశాయి. ఇంకా చెప్పాలంటే ప‌డుకున్న ఎద్దును లేపి మ‌రీ త‌న్నించుకున్న సామెత చందంగానే ఇప్పుడు దేవినేని అరెస్టుతో కృష్ణా టీడీపీకి, ఉమాకు ఎక్క‌డాలేని మైలేజ్ వ‌చ్చింది. ప్ర‌భుత్వంపై పోరాటాలు చేసే ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో ఉమా ముందు వ‌రుస‌లో ఉంటారు. పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడే ఆయ‌న ఎన్నో పోరాటాలు చేసి జిల్లా ప్ర‌జ‌ల హృద‌యాల్లో నిలిచారు. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి టీడీపీ మాజీ మంత్రులు, కీల‌క నేత‌ల‌ను వ‌రుస‌గా టార్గెట్ చేస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఉమాను అరెస్టు చేసేందుకు తాజా సంఘ‌ట‌న‌ను ఓ సాకుగా వాడుకుంటోంది. వాస్త‌వానికి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు ఫ్యామిలీ గ‌త రెండున్న‌ర ద‌శాబ్దాలుగా దేవినేని ఉమా, ర‌మ‌ణ చేతుల్లో ఓడిపోతూనే వ‌స్తోంది.

ఎట్ట‌కేల‌కు గ‌త ఎన్నిక‌ల్లో వ‌సంత కృష్ణ‌ప్ర‌సాద్ దేవినేని ఉమాను ఓడించారు. ఇక కొద్ది రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ క్వారీల తవ్వ‌కంతో పాటు ఇసుక దోపిడీ కార్య‌క్ర‌మం పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. దీనిపై ఉమా కొద్ది రోజులుగా పోరాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు ఉమాను అరెస్టు చేయ‌డంతో ఆయ‌న ఇమేజ్ మ‌రింత పెరిగింది. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ హ‌యాంలో ఇలా ఉత్తిత్తి కేసులు పెట్ట‌లేదు. చివ‌ర‌కు నంద్యాల ఉప ఎన్నిక‌ల వేళ జ‌గ‌న్ చంద్ర‌బాబును ముఖ్య‌మంత్రిగా ఉండ‌గానే న‌డిరోడ్డులో కాల్చి చంపాల‌ని చెప్పిన‌ప్పుడు కూడా బాబు లైట్ తీస్కొన్నారు. అయితే ఇప్పుడు నిర‌స‌న చేసినా అరెస్టులు చేసి జైల్లో పెట్టేస్తున్నారు.

ఇక గ‌త ఎన్నిక‌ల వేళ అప్ప‌ట్లో ఉమాను వ్య‌తిరేకించిన నేత‌ల‌తో పాటు బ‌ల‌మైన క‌మ్మ వ‌ర్గం కూడా వ‌సంత వెంట న‌డిచింది. ఇక ఇప్పుడు వీళ్లంతా ఉమాను కావాల‌ని టార్గెట్ చేస్తుండ‌డంతో తిరిగి టీడీపీ వైపు మ‌ళ్లుతున్నారు. విచిత్రం ఏంటంటే ఈ ప్ర‌భావం కృష్ణా జిల్లా మొత్తం మీడ ప‌డుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న క‌మ్మ‌, బీసీ వ‌ర్గాలు పార్టీల‌కు అతీతంగా ర‌గులుతున్నాయి. ఏదేమైనా దేవినేనికి సానుభూతి పెరిగేలా చేయ‌డంలో వ‌సంత పెద్ద సెల్ఫ్‌గోల్ వేసుకున్న వాతావ‌ర‌ణ‌మై మైల‌వ‌రంలో కనిపిస్తోంది.

ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రైనా పోరాటాలు చేయ‌వ‌చ్చు.. నిర‌స‌న తెలియ‌చేయ‌వ‌చ్చు.. అయితే మైల‌వ‌రంలో దేవినేని ఉమా ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అణిచి వేసేలా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌న్న విమ‌ర్శ‌లు సాధార‌ణ జ‌నాల్లోనూ వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల వ‌ర‌కు కాస్త సైలెంట్‌గా ఉన్న ఉమాను ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో హీరోను చేసింది వైసీపీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: