ఇక తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఇప్పుడు ఈటల, బీజేపీకి ఇటు కేసీఆర్కు ఎంతో ప్రతిష్టాత్మకంగా మారనుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో డబ్బు మంచినీళ్ల మాదిరిగా ప్రవహించనుంది. ఇంకా చెప్పాలంటే ఈ వరద ఇప్పటికే ప్రారంభమైంది. ఈ డబ్బు పంపిణీలో మిగిలిన పార్టీల కన్నా అధికార టీఆర్ ఎస్ కాస్త ముందు వరుసలో ఉంది. ఆ పార్టీ ఇప్పటికే సంఘాల వారీగా డబ్బు పంపిణీ ప్రారంభించేసినట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఇజ్జత్కు హుజూరాబాద్ ఉప ఎన్నిక పెద్ద సవాల్ కావడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప్పటి నుంచి ఇప్పటివరకు ఏ ఉప ఎన్నికకు ఇవ్వనంత ప్రయార్టీ ఈ ఉప ఎన్నికకు ఆయన ఇస్తున్నారు.
ఈ ఉప ఎన్నిక కోసమే కేసీఆర్ దళిత బంధును తెరమీదకు తీసుకు వచ్చారు. ముందుగా దీనిని అక్కడే అమలు చేస్తున్నారు. ఇక పలు కుల సంఘాల నేతలను కొనే ప్రక్రియ కూడా ముందుగా టీఆర్ ఎస్ స్టార్ట్ చేసిందని టాక్ ? ఇక ఒక్క టీఆర్ ఎస్ మాత్రమే ఈ ఉప ఎన్నిక కోసం రు. 500 కోట్ల నుంచి రు. 700 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. ఇక బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పెట్టే ఖర్చు కూడా చూస్తే మొత్తంగా రు. 1000 కోట్లకు పైగా ఇక్కడ నోట్ల కట్టలు తెగే ఛాన్సులు ఉన్నాయి.