సాగ‌ర‌క‌న్య సాహ‌స‌వీరుడు సినిమాతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌యిన శిల్పా శెట్టి త‌రువాత బాలీవుడ్‌లో అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పుడు ఈ యోగా క్వీన్‌ శిల్వాశెట్టి ప్రస్తుతం ఈ పేరు వార్తల్లో హాట్టాపిక్గా మారింది. అశ్లీల చిత్రాల దందా కేసులో ప్రధాన నిందితుడిగా ఆమె భర్త రాజ్కుంద్రా ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లడమే ఇందుకు కారణం. అయితే ఈ వ్యాపారంలో ఆమె హస్తం కూడా ఉందనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఇందులో తనకేమీ సంబంధం లేదని శిల్పా శెట్టి కుంద్రా వివరణ కూడా ఇచ్చింది. అయితే ఒకప్పుడు తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ వివాదాల్లో నిలవడం కొత్తేమి కాదు. గ‌తంలో చాలా వివాదాలు ఆమెను చుట్టు ముట్టాయి.


    అక్షయ్ కుమార్తో 1992లో 'ఖిలాడీ' సినిమాలో శిల్పాశెట్టి నటించింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని వార్తలు వినిపించాయి.. అయితే ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలువ‌లేదు.. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని బయటపెట్టింది ఆమె. అక్షయ్ తనను మోసం చేశాడని ఆరోపించింది.

   2007లో ఎయిడ్స్పై ప్రచారంలో భాగంగా భారత్ వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె శిల్పాశెట్టిని బ‌హిరంగంగా ముద్దుపెట్టుకోవ‌డంపై అప్పట్లో తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. పలు ప్రజా సంఘాలు, పార్టీలు శిల్పాకు వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్లాయి. వారిద్దరిని అరెస్ట్ చేయాలని రాజస్థాన్ కోర్టు జారీ చేసిన వారంట్ను ఆ త‌రువాత‌ సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపారేసింది.

  2002 ఇంగ్లాండ్లో 'సెలబ్రిటీ బిగ్ బ్రదర్' రియాలిటీ షోలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శిల్పాపై తన హౌస్మేట్స్ జేడ్ గుడీ, డేనియల్ లాయిడ్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి.  ఏదేమైనప్పటికీ ఆ ఎపిసోడ్లో ప్రపంచం మొత్తం ఆమెకు అండగా ఉంది.

   2006లో శిల్పాశెట్టి, రీమాసేన్లకు మధురై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఓ తమిళ దినపత్రిక కోసం వారు అసభ్యకరంగా పోజులివ్వ‌డంతో కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత దీని గురించి శిల్పా స్పందించి ఇందులో అశ్లీలత ఏముంది  ఒకవేళ నాభి చూపించడంలో అశ్లీలత ఉందంటే, దేశ సంప్రదాయమైన చీరను మొదటగా బ్యాన్ చేయాల‌ని చెప్పింది. ఈ వ్యాఖ్యలు అపట్లో పెద్ద ఎత్తున దూమారం చెలరేగాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: