జూలై 22 న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కాంగ్రెస్ అగ్ర నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కమల్ నాథ్, మల్లికార్జున్ ఖర్గే, ఎకె ఆంటోనీ, అజయ్ మాకెన్, ఆనంద్ శర్మ, హరీష్ రావత్, అంబికా సోని, కెసి వేణుగోపాల్ వంటి సీనియర్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ లో తన పాత్రకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఒక ప్రణాళికతో ఉన్నారని కూడా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ పార్టీకి విలువను పెంచగలరని తాను భావిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. “ఇది సరికొత్త ఆలోచనలు మరియు వ్యూహాలను తీసుకురావాల్సిన సమయం.
ప్రశాంత్ కిషోర్ను పార్టీలోకి తీసుకురావడం వల్ల పార్టీ కి ఎటువంటి నష్టం లేదని మరో నేత అభిప్రాయపడ్డారు. 2022 లో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చ జరగగా... ఉత్తరప్రదేశ్ లో అలాగే పంజాబ్ లో కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిషోర్ పని చేసే ఆవకాశం ఉందని మరో నాయకుడు అభిప్రాయపడినట్టుగా జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ప్రశాంత్ కిషోర్ ఏడాది క్రితం బీహార్ అధికార పార్టీ జెడిఎస్ నుంచి బయటకు వచ్చారు. బెంగాల్ లో మమతా బెనర్జీకి తమిళనాడు లో స్టాలిన్ కి ఢిల్లీలో అరవింద్ కేజ్రివాల్ కి ఆయన తన వ్యూహాలు అందించారు.