ప్రజల మద్ధతు తనకే ఉందని ఈటల చెప్పుకొస్తున్న, పార్టీ సీనియర్ల సపోర్ట్ లేదని నిరాశలొ ఈటల ఉన్నట్టు సమాచారం. గతంలో దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ నేతలు అందరు కలిసి సమిష్టిగా కృషి చేసి విజయాన్ని పొందారు. కానీ హుజురాబాద్ దీనికి తలకిందులుగా ఉన్నట్టు కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ దర్మపురి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అడపా దడపా ఈటల గురించి మాట్లాడుతున్నారు.
నియోజవర్గంలో టీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఈటలకు యాంటీగా చేస్తున్న ప్రచారాలను ఈటల ఒక్కడే నిలబడి ఎదుర్కొంటున్నాడు. అధికార పార్టీ గెలవాలని ఎత్తుల మీద పై ఎత్తులు వేయడానికి సిద్దం అయింది. నియోజకవర్గానికి చెందిన సామాన్య నేత నుంచి పెద్ద నేత వరకు చాలామణిలో ఉన్న పలువురిని సీఎం కేసీఆర్ ఇప్పటికే టచ్ చేశారు. ఇటు ప్రభుత్వం పరంగా పలు పథకాలు అమలు చేస్తూనే పార్టీ పరంగా కూడా వ్యూహాలు పన్నుతున్నాడు గులాబీ బాస్ సీఎం కేసీఆర్. ప్రచారం మొదలు కాక ముందే నియోజకవర్గంలో మంత్రులను దించడానికి టీఆర్ ఎస్ అధిష్టానం ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది.
నియోజకవర్గంలోని బీజేపీలో వర్గపోరు కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఈటల గెలిచినా ప్రతిపక్షంలో ఉండాల్సిందేనని అలా ఉంటే నియోజవర్గాన్ని ఏం అభివృద్ది చేస్తాడు అని బయట ప్రచారం కూడా ఉంది. అయినా ఈటల మాత్రం తానే గెలుస్తానని, ప్రజల దీవెనలు ఉన్నాయని విశ్వాసంతో ఉన్నాడు. ఈటల హిట్ అవుతాడ లేదా అనే విషయం ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.