కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని ప్రదేశాల్లో వ్యాక్సిన్ల కోసం జనాలు ఎగబడుతూ.. భయానక పరిస్థితులను కల్పిస్తున్నారు. ఎంతలా వ్యాక్సిన్ వేసినా కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ సరళి ఇంకా అందజేయాల్సిన వారి గురించి కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. భారతదేశంలో ఉన్న బిచ్చగాళ్లతో పాటు నిరుపేదలకు కూడా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. అంతే కాకుండా అనాథలు, రిహాబ్ క్యాంపుల్లో ఉండేవారికి కూడా వెంటనే కోవిడ్ టీకాలు వేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన సీఎస్ లకు సూచించారు. ఇలా అందరికీ వ్యాక్సిన్ వేయడం వల్లే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ నుంచి మనం త్వరగా బయట పడే చాన్స్ ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.
కాగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని ప్రదేశాల్లో వ్యాక్సిన్ల కోసం జనాలు ఎగబడుతూ.. భయానక పరిస్థితులను కల్పిస్తున్నారు. ఎంతలా వ్యాక్సిన్ వేసినా కూడా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా కష్టం అని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ సరళి ఇంకా అందజేయాల్సిన వారి గురించి కేంద్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. భారతదేశంలో ఉన్న బిచ్చగాళ్లతో పాటు నిరుపేదలకు కూడా వ్యాక్సిన్ వేయాలని సూచించారు. అంతే కాకుండా అనాథలు, రిహాబ్ క్యాంపుల్లో ఉండేవారికి కూడా వెంటనే కోవిడ్ టీకాలు వేసేలా అధికారులను ఆదేశించాలని ఆయన సీఎస్ లకు సూచించారు. ఇలా అందరికీ వ్యాక్సిన్ వేయడం వల్లే కరోనా మహమ్మారి ఎఫెక్ట్ నుంచి మనం త్వరగా బయట పడే చాన్స్ ఉందని అందరూ అభిప్రాయపడుతున్నారు.