"కేసీఆర్ కాల్మొక్కినోడు
యాడున్నడు
చంద్రబాబు పెట్టించిన
ఛానెల్ తో పైసల్ దండినోడు
ఎట్లున్నడు
ఎట్లున్నడో కొడుకు ఎలా దండిండో!
యాడ ఉన్నాడో యే మాయ జేస్తడో!
ఈ గారడి వెన్క ఈ గజిబిజి వెన్క
ఉన్నదెవ్వరు?" అంటున్నాడో జర్నలిస్టు
ఆహా ! వినుండ్రి! ఈ గాయమయిన గాథ
తెలంగాణలో మల్లన్న తెరకట్టి ఆడిస్తున్న బొమ్మలాట
తీన్మార్ ఆడిస్తడు కేసీఆర్ ను.. అవునా! తెల్వదు
అంటున్నడు చిలుకా ప్రవీణ్ అనే జర్నలిస్టు..
దగా పడ్డ తమ్ముడు.. ఆ వివరాలివి..
పొద్దున్న లేస్తే తీన్మార్ మల్లన్న వస్తడు..గా పోరగాని క్యూ న్యూస్ వస్తది...మార్నింగ్ ఎడిషన్ లో ఎనాలసిస్ వస్తది..అందరినీ తిట్టే డోడ్ని ఒక్కడు తిట్టిండు.అధికారం ఉన్న అందర్నీ దగాకోరులను అనేటోడ్ని రోడ్డు కీడ్చిండు అదే ఛానెల్ బ్యూరో చీఫ్ చిలుకా ప్రవీణ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీన్మార్ మల్లన్నగా పేరున్న నవీన్ కుమార్ (క్యూ న్యూస్ ఛానెల్ హెడ్) పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు కేసీఆర్ కాల్మొక్కి ఇరవై కోట్లు తెచ్చుకున్నారని, అదేవి ధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టించిన ఛానెల్ లోనే ఆయన ప్రతిరోజూ వార్తలు చదువుతున్నడనీ, ఆయనకూ ఈయన ఏ విధంగా సాయపడిండో అన్నది కూడా చెప్తనని పేర్కొంటూ పెను సంచలనానికి తెరతీశారు. ఆయన వినిపించే బహుజన వా దం అంతా అబద్ధమని, పలు అక్రమాలకు పాల్పడి తమలాంటి వారిని అన్యాయం చేశాడని వాపోయారు. తాము రేవంత్ కు కానీ, బండి సంజయ్ కు కానీ అనుచరులం కాదని, వాళ్ల దగ్గర తాము డబ్బులు కాజేయలేదని, అలాంటి పనులు చేసిన ఘనత మల్ల న్నదేనని ఆరోపించారు. ఓ స్వచ్ఛంద సంస్థ పేరిట యాభై కోట్లు గుంజుకునేందుకు ఢిల్లీ కేంద్రంగా ప్లాన్ వేశాడని, అదేవిధంగా వివిధ పార్టీల నేతల దగ్గర కోట్ల రూపాయలు దండుకున్నాడని వీటితో పాటు మరికొన్ని దందాలపై తమ దగ్గర ఆధారాలున్నాయ ని వాటన్నింటినీ త్వరలోనే బయటపెడ్తానని తెలిపారు.