చంద్రబాబుకు తాను చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఆయన జయప్రదను ఒకసారి రాజ్యసభకు పంపించారు. ఆరేళ్లపాటు జయప్రద ఢిల్లీలో ఎంపీ హోదాలో అధికారం అనుభవించారు. అయితే ఆ తర్వాత ఆమె చంద్రబాబు తో విభేదించి తెలుగుదేశం కు గుడ్ బై చెప్పేశారు. దీనికి ప్రధాన కారణం జయప్రదను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసేందుకు చంద్రబాబు ఒప్పుకోలేదు. ఈ విషయం పై అలిగిన ఆమె తెలుగుదేశం పార్టీని వీడడంతో పాటు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ఆమె పార్టీ నుంచి తప్పుకుని.. తెలుగు మహిళ అధ్యక్ష పదవి కూడా వదులుకున్నారు.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆమె బాబు అంటే కోపంతోనే ఉన్నారు. అయితే ఆమె ఢిల్లీలో ఎంపీగా ఉన్న సమయంలో అప్పటి సమాజ్ వాదీ పార్టీ అధినేత అమర్సింగ్తో ఏర్పడిన సాన్నిహిత్యం నేపథ్యంలో ఆమె యుపి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ రాంపూర్ నుంచి రెండు సార్లు ఎస్పీ తరపున ఎంపీగా విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు ఆమె బిజెపిలో చేరి నుంచి అజాంఘడ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.