ఇది ప్రస్తుతం తెలంగాణలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బల్కసుమన్ ప్రాతినిద్యం వహిస్తున్న చెన్నూరు నియోజవర్గంలో ఈ నకిలీ బంగారు బిస్కెట్ల దందా కొనసాగుతోంది. ఇక్కడ అడ్డు అదుపు లేకుండా గోల్డ్ బిస్కెట్లను విక్రయించడంతో పోలీసులకు పలు ఫిర్యాదులు అందడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ నకిలీ గోల్డ్ దందా మంచిర్యాల నుంచి చెన్నూరు అడ్డగా మారింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. కానీ పోలీసులకు పై నుంచి ఈ విషయంలో కల్పించుకోకుండా రాజకీయ ఒత్తిడి వస్తోందని తెలుస్తోంది.
అసలు ఈ నకిలీ బంగారం ఎలా తయారు చేస్తారంటే.. బంగారాన్ని కరిగించే సమయంలోనే ఈ నకిలీ బంగారం దందా మొదలవుతుంది. 99.990 బరువు ఉండే విధంగా అందులో వెండిని కలుపుతారు. దీంతో తక్కువ ధరకే ఈ బిస్కెట్లు విక్రయిస్తారు. గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఈ విషయంపై స్పందించని పోలీసులు ఇప్పుడు బాధితుల ఫిర్యాదుతో కదిలారని తెలుస్తోంది. తీగ లాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా.. అధికార పార్టీ ఎమ్మెల్యే బల్కసుమన్ ఎమ్మెల్యే గా ఉండడంతో ఈ వ్యవహారం అంతా అధికార పార్టీ కి చుట్టుకుంటుంది.