ఈ సమావేశంలో పాకిస్తాన్తో భారత్ సత్సంబంధాలు, అఫ్ఘనిస్తాన్ అంశాలపై కూడా తిరుమూర్తి చర్చించారు,. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్ భారత్ అంతర్భాగమని, ఇకపై ఏదైనా అంశంపై చర్చించాలంటే అది పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గురించే అని ఆయన తెలిపారు. ఐక్యరాజ్య భద్రతా మండలి అధ్యక్ష పదవిని ఇండియా చేపట్టిన క్రమంలో.. తిరుమూర్తి తీరప్రాంత భద్రత, ఉగ్రవాద నిరోధం, శాంతి పరిరక్షణ మొదలైన కీలక అంశాలపై సంతకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
భారత్లో ఉగ్రవాద స్థావరాలు లేవని, అఫ్గనిస్తాన్ పరిస్థితుల ప్రభావం భారతదేశంపై తీవ్రంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. స్వతంత్ర, శాంతియుత, ప్రజాస్వామ్య దేశంగా అఫ్గనిస్తాన్ను చూడాలని భారత్ కోరుకుంటోందని తెలిపారు. ఐరాస భద్రతా మండలి అధ్యో పదవిని చేపట్టిన భారత్ ఆగస్టు నెల మొత్తం వరకు ఈ పదవిలో భారత్ కొనసాగనుంది.