ఇటీవల కాలంలో భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. సరిహద్దుల్లో తలెత్తే ఉద్రిక్త పరిస్థితులను సద్దుమణిగేలా చేయడానికి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. అయినప్పటికీ పాకిస్థాన్ మాత్రం కుక్క తోక వంకర అనే విధంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఎప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్లోకి అక్రమంగా ఉగ్రవాదులను పంపించడం లాంటివి చేస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఏకంగా సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు కూడా తెగ పడుతుంటుంది. ఇలా పాకిస్తాన్ ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించిన భారత ఆర్మీ మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ దీటుగా బదులిస్తూ ఉంటుంది.



 అయితే ఎవరైనా ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్ సైన్యం భారత సరిహద్దుల్లో కి రావడానికి ప్రయత్నిస్తే మొదట వారికి వార్నింగ్ ఇవ్వడానికి గాల్లోకి కాల్చడం లాంటివి చేస్తుంది భారత ఆర్మీ. అయినప్పటికీ ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్ ఆర్మీ వినకపోతే ఇక నేరుగా ఉగ్రవాదుల గుండెల్లో బుల్లెట్ దింపుతుంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దు లో ఎప్పుడు పరిస్థితులు హాట్ హాట్ గానే ఉంటాయి. కాబట్టి ఇక సైనికులు ఎప్పటికప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా పహారా కాస్తూ ఉంటారు.  ఇలా సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఒక సైనికుడు చూపించిన క్రియేటివిటీ కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.



 సరిహద్దు ప్రాంతంలో ఒక బోర్డు పై ఒక ఆసక్తికర విషయాన్ని రాశాడు సైనికుడు. ఇది కాస్తా ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం బుల్లెట్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వార్నింగ్ షాట్స్ ఇక నుంచి కాల్చలేము.. ఇక్కడి నుంచి మిమ్మల్ని నేరుగా కాల్చేస్తాం..  దయచేసి అర్థం చేసుకోండి.. కృతజ్ఞతలు అంటూ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పాకిస్తాన్ సరిహద్దు నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడే వారికి ఒక హెచ్చరిక లాంటిది ఇచ్చాడు భారత సైనికుడు. ప్రస్తుతం ఇది కాస్త పెద్ద ఎత్తున వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: