అయితే ఎన్కౌంటర్ ఘటనపై విచారణ జరిపించేందుకు అటు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది అదే సమయంలో కేంద్రం నుంచి మానవ హక్కుల సంఘం కూడా వచ్చి విచారణ జరిపించింది. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందం విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించాల్సి ఉంది. అయితే ఇటీవలే ఇక దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసు పై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా దిశ ఎన్ కౌంటర్ పై విచారణ కమిటీ ఇంకా విచారణ కొనసాగిస్తున్నారని దీనికి సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టులో సమర్పించడానికి ఇంకా కొంత సమయం కావాలి అంటూ తెలంగాణ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
అయితే అటు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి పై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దిశ ఎన్ కౌంటర్ కేసు పై నివేదిక సమర్పించాలని కోరినప్పుడల్లా తెలంగాణ ప్రభుత్వం సమయం కావాలి అంటూ అడుగుతుంది. ఇలా పదే పదే సమయం ఎందుకు అడుగుతున్నారు అంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఇప్పటికే దిశ ఎన్కౌంటర్ కేసులో ఏకంగా 170 మందిని ప్రశ్నించామని.. ఇంకెంత మందిని ప్రశ్నించాలి అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగింది. ఇక చివరికి దిశ ఎన్ కౌంటర్ కేసు నివేదిక సమర్పించడానికి ఆరునెలల సమయం కేటాయించింది సుప్రీం కోర్టు. ఆరు నెలల్లోగా తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని అంటూ ఆదేశాలు జారీ చేసింది.