ఎవ్వరు ఎవ్వరినయినా తిట్టండి
బాగా తిట్టండి బాగా తిడితే
మీకు పదవి ఇస్తాం
ఎవరు ఎవరిని అయినా టార్గెట్ చేయండి
డబ్బులు పంచడం సీట్లు సర్దడంతో పాటు
ఇంకొన్ని తిట్లు కూడా మీకు వస్తే బెటర్
రేవంత్ ను తిట్టండి ఈటెలను తిట్టండి
మీ ఇష్టం బరాబర్ మీకు ఏమీ వస్తే
అవి తిట్టండి..విచక్షణ ఉండొద్దు
ఇంకా వీలుంటే ఆడియో టేపులు లీక్ చేయండి
రాజకీయం ఎలా ఉన్నా..రాజకీయ పార్టీల తీరు ఎలా ఉన్నా..కొన్ని ఊహకు అందవు. కొన్ని అంచనాకు తూగవు.డబ్బులున్న వారికే రాజకీయం తో పాటు.. తెలివి నమ్మకద్రోహం లాంటివి తెలిసి ఉన్న వారికి కూడా రాజ కీయం చెల్లుబాటు కావొచ్చు.మొద ట్లో ఎవ్వరూ ఇలాంటివి పట్టించుకోరు. ఏం చేస్తారు చిన్నచిన్న లీడర్లే కదా అని వదిలేస్తారు. కాల గతిలో వీళ్లంతా పెద్దవాళ్లయి పో తారు. ఎవ్వరిని అయినా టార్గెట్ చేస్తారు. అలాంటి రాజ కీయం తెలంగాణలో ఉంది. కొత్తగా ఎమ్మెల్సీ పదవి అందుకోనున్న కౌశిక్ రెడ్డి కేసీఆర్ తరఫున మాట్లాడబోతున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ ను టార్గెట్ చేయబోతున్నారు. ఒకనాటి తన ప్రత్యర్థి ఈటెలను నానా మాటలూ అనబోతున్నారు.
ఓ విధంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతతో అదే కులానికి చెందిన నేతను తిట్టించాలన్న ప్లాన్ కేసీఆర్ వేశారు. ఆ వ్యూహంలో భాగంగానే ఆయన రేవంత్ కు ప్రత్యర్థిగా కౌశిక్ ను తయారు చేశారు. ఎన్నికల ప్రచార బా ధ్యతలు అందుకున్నాక లేదా అంతకుపూర్వమో అమాత్య పదవి దక్కా కౌశిక్ ఇంకా బలపడతారు. ఈ పదవిని అడ్డం పెట్టుకుని పీసీసీ చీఫ్ పై మరిన్ని ఆరోపణలకు, వాగ్యుద్ధాలకు ఆయన సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ చె బుతుందే ఇది. ఈ హుజురా బాద్ ఎన్నికల కారణంగా హైలెట్ అయ్యేది కౌశిక్ రెడ్డే కావొచ్చు. కానీ తరువాత కాలంలో ఆయన భవిష్యత్ ఏంటన్నది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.ఎందుకంటే ఎన్నికల తరువాత టీఆర్ఎస్ గెలిచినా ఓడినా ముందున్న ప్రాధాన్యం ఆయనకు కేసీఆర్ ఇవ్వరు. కానీ మంత్రి పదవి కేటాయించినా కూడా పెద్ద ప్రాధాన్యం ఉన్న శాఖ దక్కక పోవచ్చు. ఇలాంటి తరుణంలో కౌశిక్ లాంటి లీడర్లు తక్షణ అవసరాలకు
మాత్రమే ఉపయోగపడతారు. తరువాత వారిని జీరో చేసేయ్యడం ఖాయం. రెడ్డి సామాజిక వర్గం నుంచి తాను అనుకున్న మద్దతు పొందేందుకు కేసీఆర్ ఈ ఎన్నికల వరకూ కౌశిక్ ను హీరో చేస్తారు.